మహేష్,రాజమౌళి రెగ్యులర్ గా కలుస్తూ..డిస్కస్ చేస్తున్నారు

By Udayavani DhuliFirst Published Nov 19, 2018, 11:39 AM IST
Highlights

మహేష్, రాజమౌళి ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా వినపడుతోంది. రాజమౌళి ఓ జేమ్స్ బాండ్ కథను మహేష్ కోసం రెడీ చేసారని..బాహుబలి అవ్వగానే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని అంతా భావించారు.

మహేష్, రాజమౌళి ఈ కాంబినేషన్ గురించి చాలా కాలంగా వినపడుతోంది. రాజమౌళి ఓ జేమ్స్ బాండ్ కథను మహేష్ కోసం రెడీ చేసారని..బాహుబలి అవ్వగానే ప్రాజెక్టు స్టార్ట్ అవుతుందని అంతా భావించారు. అయితే అందరి అంచనాలు తలక్రిందులు చేస్తూ రాజమౌళి..మల్టిస్టారర్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో మొదలెట్టారు. ఆర్.ఆర్.ఆర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రం ఈ రోజే షూటింగ్ మొదలైంది. మరి మహేష్ తో సినిమా లేదా అంటే ఉందీ అని తెలుస్తోంది. ఈ మేరకు ఓ స్టోరీ లైన్ ని కూడా లాక్ చేసారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం.

గత కొంతకాలంగా మహేష్, రాజమౌళి కంటిన్యూగా టచ్ లోనే ఉంటున్నారని, నాలుగైదు స్టోరీ ఐడియాలు డిస్కస్ చేసాక..ఒకటి ఫైనలైజ్ చేసారని , దానిపై స్క్రిప్టు వర్క్ స్టార్ట్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. అయితే ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పార్ట్ పూర్తికాగానే రిలీజ్ కు ముందే ఈ సినిమాని లాంచ్ చేస్తారని, లేటు చెయ్యరని వినికిడి. అలాగే తను బల్క్ గా డేట్స్ ఇవ్వటం కష్టమని..ఇప్పటికే చాలా మందికి మాట ఇచ్చానని మొహమాటం లేకుండా మహేష్ చెప్పి...దానికి తగినట్లుగా ప్లాన్ చేసుకోమని చెప్పినట్లు సమాచారం. 

ఇక మహేష్ తో రాజమౌళి చేసే ప్రాజెక్టుకు సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎల్ నారాయణ నిర్మాతగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కె.ఎల్ నారాయణ రీసెంట్ గా జరిగిన ఆర్.ఆర్.ఆర్ లాంచింగ్ కు వచ్చారు. ఆయన ఈ మధ్యకాలంలో సినిమాలు ఏవీ ప్రొడ్యూస్ చేయటం లేదు. అయితే రాజమౌళి కు గతంలో అడ్వాన్స్ ఇచ్చి ఉన్నారని, ఆ సినిమాతోనే రీలాంచ్ అవుతారని చెప్పుకుంటున్నారు. 

ఇక తన తాజా చిత్రం ‘మహర్షి’లో బిజీగా ఉన్న మహేష్ బాబు ..ఈ ప్రాజెక్టుకు సంభందించి ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారని, తమ కాంబినేషన్ లో ఓ కొత్త తరహా చిత్రం తెరకెక్కాలని అనుకుంటున్నట్లు చెప్తున్నారు. ఇది ఓ రకంగా మహేష్ అభిమానులకు శుభవార్తే. ఎందుకంటే రాజమౌళి, మహేష్ కాంబినేషన్ అంటే ఏ స్దాయిలో సినిమా ఉండబోతుందో లెక్కేసుకోవచ్చు. 

click me!