శ్రీలంక బాంబ్ పేలుళ్లు.. తప్పించుకున్న సినీ నటి!

By Udaya DFirst Published Apr 21, 2019, 2:06 PM IST
Highlights

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి.

శ్రీలంక రాజధాని కొలంబోలో ఈరోజు ఉదయం ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో వరుస బాంబ్ పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో దాదాపు 160కి పైగా మృత్యువాత పడగా.. 400 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 

ఈస్టర్ సండే సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలలో పాల్గొన్న భక్తులను లక్ష్యంగా పెట్టుకొని ఉగ్రవాదులు ఈ దాడులకు పాల్పడ్డారు. కొలంబోలో మొత్తం ఆరు ప్రాంతాల్లో బాంబ్ దాడులు జరిగినట్లు సమాచారం. వాటిల్లో సిన్నామన్ గ్రాండ్ హోటల్ కూడా ఉంది. అయితే ఈ ఘటన నుండి త్రుటిలో బయటపడినట్లు నటి రాధికా శరత్ కుమార్ వెల్లడించారు. 

సిన్నామన్ గ్రాండ్ హోటల్ లో స్టే చేసిన రాధికా.. బాంబ్ దాడికి కొద్ది నిమిషాల ముందు ఆమె హోటల్ నుండి వెళ్లిపోయారట. దాంతో ఆమె ఈ దాడి నుండి తప్పించుకోగలిగింది. ఈ ఘటన గురించి తెలుసుకున్న రాధికా షాకింగ్ గా ఉందని.. దేవుడు అందరితో ఉండాలని సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. 

 

OMG bomb blasts in Sri Lanka, god be with all. I just left Colombo Cinnamongrand hotel and it has been bombed, can’t believe this shocking.

— Radikaa Sarathkumar (@realradikaa)
click me!