`నారప్ప` ఓటీటీలో నా నిర్ణయం కాదు.. అది ఎంత వరకు న్యాయంః వివాదంపై నిర్మాత సురేష్‌ బాబు

Published : Jul 17, 2021, 03:54 PM IST
`నారప్ప` ఓటీటీలో నా నిర్ణయం కాదు.. అది ఎంత వరకు న్యాయంః వివాదంపై నిర్మాత సురేష్‌ బాబు

సారాంశం

 వెంకీ నటించిన `నారప్ప` చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సురేష్‌బాబు, కళైపులి ఎస్‌ థాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

వెంకటేష్‌ నటించిన `నారప్ప` చిత్రం ఈ నెల 20న ఓటీటీలో విడుదల కాబోతుంది. అంతకు ముందే తెలంగాణ స్టేట్‌ ఫిల్మ్ ఛాంబర్‌ నుంచి ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు పెద్ద సినిమాలు కొంత కాలం వెయిట్ చేయమని రిక్వెస్ట్ చేశారు. తాము సినిమాలపైనే ఆధారపడ్డామని, సినిమాని నమ్ముకుని థియేటర్‌, అందులో పనిచేసే సిబ్బంది, ఇతర వాళ్లు ఎంతో మంది ఉపాధి ఆధారపడి ఉందని వెల్లడించారు. అక్టోబర్‌ వరకు ఓపికగా ఉండమని కోరారు. 

కానీ వెంకీ నటించిన `నారప్ప` చిత్రాన్ని ఈ నెల 20న అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు సురేష్‌బాబు, కళైపులి ఎస్‌ థాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఈ నిర్మాతలపై ఎగ్జిబిటర్లు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది వివాదంగా మారడంతో తాజాగా నిర్మాత సురేష్‌బాబు స్పందించారు. సినిమా ఓటీటీ అనేది తన ఒక్కడి నిర్ణయం కాదన్నారు. కళైపులి ఎస్‌ థాను తీసుకున్న నిర్ణయమన్నారు. 

`సురేష్‌ ప్రొడక్షన్‌లో వచ్చే సినిమాల విడుదల నిర్ణయం నా చేతుల్లోనే ఉంటుంది. కానీ `నారప్ప` విషయంలో అది డిఫరెంట్‌. మేం ఇందులో భాగస్వాములం మాత్రమే. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకునే నిర్మాత ఎస్‌.థాను ఈ చిత్రాన్ని అమెజాన్‌లో విడుదల చేయాలని నిర్ణయించారు. కరోనా థర్డ్ వేవ్‌ దృష్ట్యా ఎవరూ నష్టపోకూడదనే ఈ నిర్ణయాన్ని స్వాగతించాం. ఎగ్జిబిటర్లకు నాపై అసంతృప్తి ఉండటంలో న్యాయం ఉంది. 

కానీ, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మన కుటుంబ సభ్యుల్నే థియేటర్‌కు పంపించడం లేదు. అలాంటిది ప్రేక్షకుల్ని థియేటర్లకు రమ్మని అడగడం న్యాయమా? తన సినిమాని ఎలాగైనా ప్రజలకు చేరువ చేసేందుకు నిర్మాత కష్టపడతాడు. భవిష్యత్తు ఓటీటీదే కావొచ్చు కానీ థియేటర్లు కూడా ఉంటాయి` అని సురేష్‌ బాబు తెలిపారు. ఈ వివాదంపై తన వరకు క్లారిటీ ఇచ్చేప్రయత్నం చేశారు. ఇదిలా ఉంటే ఇటీవల సినిమా నిర్మాతకి తనచిత్ర విడుదలపై సర్వహక్కులుంటాయని, ఎక్కడ విడుదల చేయాలనేది తన ఇష్టమని సురేష్‌బాబు చెప్పిన విషయం తెలిసిందే. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు