`బుట్టబొమ్మ` ఫ్లాప్‌ అని త్రివిక్రమ్‌ ముందే చెప్పారు.. నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌..

Published : Feb 12, 2023, 03:14 PM IST
`బుట్టబొమ్మ` ఫ్లాప్‌ అని త్రివిక్రమ్‌ ముందే చెప్పారు.. నిర్మాత నాగవంశీ బోల్డ్ స్టేట్‌మెంట్‌..

సారాంశం

నిర్మాత నాగవంశీ `బుట్టబొమ్మ` సినిమా ఫలితంపై స్పందించారు. సినిమా పోవడానికి కారణమేంటో తెలిపారు. అంతేకాదు త్రివిక్రమ్‌ ముందే ఊహించారంటూ పెద్ద షాక్‌ ఇచ్చారు.

సితార ఎంటర్‌టైన్‌మెంట్‌ నుంచి వచ్చే సినిమాలంటే మినిమమ్‌ గ్యారంటీ అనే బ్రాండ్‌ పడింది. ఆయా సినిమాలపై కొంత అంచనాలు నెలకొన్నాయి. కానీ దానికి బ్రేకులు వేసింది `బుట్టబొమ్మ`. గత వారం వచ్చిన `బుట్టబొమ్మ` మూవీ దారుణంగా పరాజయం చెందింది. కొత్త టీమ్‌తో చేసిన ఈ మూవీ దారుణంగా ఫ్లాప్‌ అయ్యింది. మొదటి షో నుంచే డిజప్పాయింట్‌ చేసింది. ఈ సినిమా మలయాళంలో రూపొందిన `కప్పెలా`కి రీమేక్‌. మూడేళ్ల క్రితం వచ్చిన ఈ మూవీ అక్కడ విజయం సాధించింది. దాన్ని తెలుగులో `బుట్టబొమ్మ`గా రీమేక్‌ చేశారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. 

అయితే ఈ సినిమా స్లోగా సాగడం, కంటెంట్‌లో దమ్ము లేకపోవడంతో తెలుగు ఆడియెన్స్ ని నిరాశ పరిచింది. అయితే తాజాగా ఈ చిత్ర ఫలితంపై నిర్మాత సూర్య దేవరనాగవంశీ స్పందించారు. ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన `బుట్టబొమ్మ` ఫ్లాప్‌ గురించి ఓపెన్‌ అయ్యారు. మలయాళ మూవీ నచ్చి రీమేక్‌ చేయాలనుకున్నా. కానీ మూడేళ్లలో పరిస్థితులు మారిపోయాయి. అప్పుడు బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఆడియెన్స్ అభిరుచి మారిపోయిందన్నారు. దీంతో ఈ సినిమా ఫెయిల్‌ అయ్యింది. 

`ఈ సినిమాని చూసిన బాబాయి రాధాకృష్ణ, దర్శకుడు త్రివిక్రమ్‌ ఫలితాన్ని ముందే ఊహించారు. అందుకే మేం డిస్ట్రిబ్యూటర్ల నుంచి డబ్బులు తీసుకోకుండానే రిలీజ్‌ చేశామని తెలిపారు నాగవంశీ. ఆయన ప్రస్తుతం `సార్‌` చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ధనుష్‌ హీరోగా నటించిన చిత్రమిది. సంయుక్త మీనన్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈ నెల 17న విడుదల కానుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ఆయన పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. 

చదువు గొప్పతనం చెప్పే చిత్రమిది. చదువు వెనకాల పడే స్ట్రగుల్‌ని తెలియజేసేలా ఈ చిత్రం ఉండబోతుందని చెప్పారు. కచ్చితంగా హిట్‌ అవుతుందని, ధనుష్‌ చాలా బాగా చేశారని, తెలుగు ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పారు. దీంతోపాటు మహేష్‌-త్రివిక్రమ్‌ సినిమా అప్‌డేట్‌ ఇచ్చారు. ఈ చిత్రాన్ని ఆగస్టులో విడుదల చేస్తామన్నారు. `టిల్లు స్వ్కైర్‌` ని జులైలో విడుదల చేయాలనుకుంటున్నామని చెప్పారు నాగవంశీ. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ