హీరోయిన్ అనుష్క పేరిట రూ . 51 లక్షల మోసం 

By Sambi ReddyFirst Published Jan 25, 2023, 4:46 PM IST
Highlights


చిత్ర పరిశ్రమలో అడుగడుగునా మొసగాళ్ళు ఉంటారు. జనాల వీక్నెస్ క్యాష్ చేసుకొని బోల్తా కొట్టిస్తారు. యువ నిర్మాత భారీగా డబ్బులు కోల్పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.  
 


పరిశ్రమలో ఎవరి నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలియని పరిస్థితి. ఛాన్స్ దొరికితే టోపీ పెట్టేందుకు చాలా మంది ఎక్స్పర్ట్స్ సిద్ధంగా ఉంటారు. ఓ వర్థమాన నిర్మాత అనుష్క పేరిట మోసపోయాడు. పెద్ద మొత్తంలో సొమ్ము కోల్పోయాడు. విషయంలోకి వెళితే ఎల్లారెడ్డి అనే వ్యక్తి లక్ష్మాచారి అనే నిర్మాతకు టోకరా వేశాడు. విశ్వకర్మ క్రియేషన్స్ అధినేత లక్ష్మాచారి ఎల్లారెడ్డిని నమ్మి రూ. 51 లక్షలు రెండు దఫాలుగా చెల్లించాడు. 

నిర్మాత లక్ష్మాచారికి అనుష్క శెట్టి డేట్స్ ఇప్పిస్తానంటూ ఎల్లారెడ్డి డబ్బులు వసూలు చేశారు. అలాగే మణిశర్మను కలిపిస్తా అని హామీ ఇచ్చాడట. అనుష్క శెట్టితో సినిమా చర్చలు అంటూ పలుమార్లు లక్ష్మాచారిని ఎల్లారెడ్డి బెంగుళూరు తీసుకెళ్లాడట. అనుష్క డేట్స్ దొరుకుతాయని నమ్మిన లక్ష్మాచారి మొదట రూ. 26 లక్షలు ఇచ్చాడట. అనంతరం మరో రూ. 25 లక్షలు చెల్లించాడట. 


రోజులు గడుస్తున్నా లక్ష్మాచారికి అనుష్క అప్పాయింట్ కానీ, డేట్స్ కానీ దొరకలేదు. ఎల్లారెడ్డిపై అనుమానం వచ్చి డబ్బులు వెనక్కి ఇచ్చేయాలని లక్ష్మాచారి డిమాండ్ చేశాడు. మొదట్లో డబ్బులు తిరిగి ఇస్తానని హామీ ఇచ్చిన ఎల్లారెడ్డి అనంతరం బెదిరింపులకు దిగాడట. తన ఇంట్లో ఆడవాళ్ళతో లక్ష్మాచారి మీద కేసు పెట్టిస్తానని హెచ్చరికలు జారీ చేశాడట. దీంతో లక్ష్మాచారి జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. 

ఎంతో కొంత పరిశ్రమ పట్ల అవగాహన ఉన్నవాళ్లు కూడా ఈజీగా చీటర్స్ ట్రాప్ లో పడుతున్నారు. అవకాశాల పేరిట మోసపోతున్నారు. ప్రతి ఏడాది ఇలా మోసాలకు పాల్పడే వారి సంఖ్య పెరిగిపోతుంది. అనుష్కతో మూవీ అనగానే గుడ్డిగా డబ్బులు ఇచ్చి లక్ష్మాచారి మొత్తంగా మునిగిపోయాడు. 
 

click me!