సలార్ రిలీజ్ ట్రైలర్.. ప్రశాంత్ నీల్ పై భార్య గుస్సా.. వైరల్ పోస్ట్.?

By Nuthi SrikanthFirst Published Dec 18, 2023, 4:44 PM IST
Highlights

Salaar నుంచి ప్రభాస్ అభిమానులకు పూనకాలు తెప్పించే ట్రైలర్ విడుదలైంది. అంతాబాగానే ఉంది  కానీ... ప్రశాంత్ నీల్ భార్య మాత్రం ఆయనపై గుస్సా అయ్యింది. ప్రస్తుతం ఆమె ఇన్ స్టా స్టోరీ వైరల్ గా మారింది.

సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)  ప్రభాస్ అభిమానులకు కావాల్సిన ట్రైలర్ ను విడుదల చేశారు. Salaar Release Trailer ను ఈరోజు మధ్యాహ్నం రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ ట్రైలర్ లో ప్రభాస్ ను తక్కువ సమయం చూపించారు. పైగా ఎఫెక్టివ్ గా చూపించలేదని అభిమానులు అప్సెట్ అయ్యారు. దీంతో సలార్ లాస్ట్ పంచ్ అంటూ తాజాగా సెకండ్ ట్రైలర్ విడుదల చేయడంతో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. 

అయితే, ఈ ట్రైలర్ విడుదల అయిన వెంటనే ప్రశాంత్ నీల్ భార్య లిఖితా రెడ్డి (LikithaReddy)  ఆసక్తికరమైన పోస్ట్ పెట్టింది. Prashanth Neel అంటూ కోపంగా చూస్తున్న మూడు ఎమోజీలతో ఇన్ స్టా స్టోరీని పెట్టింది. దీంతో ఆమె కోపానికి కారణం ఎంటనేదని ఆసక్తికరంగా మారింది. నీల్ ఏం తప్పుచేశారని అభిమానులంతా చర్చించుకుంటున్నారు. బహుశా తను అనుకున్న విధంగా ట్రైలర్ ను విడుదల చేయలేకపోయి ఉంటాడేమోనని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. 

Latest Videos

ఏదేమైనా నీల్ భార్య ఇన్ స్టా పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ట్రైలర్ చూసిన అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ ను ఇప్పుడే ఆకాశానికి ఎత్తుతున్నారు. ఇక మ్యూజిక్ కూడా మూవీలో ఇంతకు మించి ఉండాలని కోరుకుంటున్నారు. ప్రస్తుతం సెకండ్ ట్రైలర్ ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఇదిలా ఉంటే.. నిఖితా రెడ్డి ప్రశాంత్ నీల్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. సలార్ కోసం కూడా ఆమె ఎంతగానో ఎదురుచూస్తున్నారు. 

సలార్ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు,  శ్రియా రెడ్డి, ఈశ్వరీ రావు, సప్తగిరి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంచారు. నాలుగు రోజుల్లో సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి రవి బర్సూర్ సంగీతం అందిస్తున్నారు. 

click me!