బై బై బీజేపీ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్!

Published : Dec 11, 2018, 01:54 PM IST
బై బై బీజేపీ.. ప్రకాష్ రాజ్ కామెంట్స్!

సారాంశం

నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా ఎప్పటికప్పుడు నాయకులను ప్రశ్నిస్తూనే ఉంటాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన బీజెపీ పార్టీపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది. 

నటుడిగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ రాజకీయాల పరంగా ఎప్పటికప్పుడు నాయకులను ప్రశ్నిస్తూనే ఉంటాడు ప్రకాష్ రాజ్. తాజాగా ఆయన బీజెపీ పార్టీపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.

తెలంగాణా రాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతుంటే.. రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మిజోరాం రాష్ట్రాల్లో బీజేపీకి ఓటర్లు షాక్ ఇస్తున్నారు. ఆ 
రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి దిశగా ప్రయాణిస్తుంది.

దీంతో ఈ విషయంపై సినీ నటుడు ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. 'ఇది దేశపౌరుల మన్ కీ బాత్.. వరుస ఎన్నికల్లో బీజేపీకి ఓటర్లు బై బై చెబుతున్నారు. మీ అందరికీ ఓటమికి గల కారణాలు ఏంటో తెలుసా..? లేకపోతే ఇంకెప్పుడు తెలుసుకుంటారు' అంటూ ట్వీట్ చేస్తూ 'జస్ట్ ఆస్కింగ్' అనే హ్యాష్ ట్యాగ్ ని జత చేశారు. 

PREV
click me!

Recommended Stories

Rajamouli : నేను మూర్ఖుడిని కాను.. ఆ పేరు చెప్పను.. రాజమౌళి సంచలన వ్యాఖ్యలు ఎవరి గురించి?
ప్రభాస్ 'స్పిరిట్'పై కొత్త రచ్చ.. దీపిక తర్వాత ఇప్పుడు ప్రకాశ్ రాజ్.. అసలేం జరుగుతోంది?