పార్టీ స్థాపించి మళ్ళీ ఎలక్షన్స్ కి సిద్దమవుతున్న ప్రకాష్ రాజ్

Published : May 30, 2019, 01:03 PM IST
పార్టీ స్థాపించి మళ్ళీ ఎలక్షన్స్ కి సిద్దమవుతున్న ప్రకాష్ రాజ్

సారాంశం

  సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగానే రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. పార్టీ స్థాపించి మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని తెలిపారు. 

సినీ నటుడు ప్రకాష్ రాజ్ చెప్పినట్టుగానే రాజకీయాల్లో మరో అడుగు ముందుకు వేస్తున్నారు. పార్టీ స్థాపించి మరికొన్ని రోజుల్లో జరగబోయే ఎలక్షన్స్ లో పోటీ చేస్తామని తెలిపారు. ఇటీవల బెంగుళూరు సెంట్రల్ లోక్ సభ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నిలబడి ప్రకాష్ రాజ్ భారీ ఓటమిని ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. 

కేవలం 2.4% ఓట్లను అందుకొని మూడవస్థానంలో నిలిచారు. ఆ స్థానంలో బీజేపీ నాయకుడు పిసి.మోహన్ 50.4% ఓట్లను అందుకొని భారీ విజయాన్ని అందుకున్నారు. అయితే పార్టీని స్థాపించి ఇక నుంచి ప్రజల్లోకి వెళతామని ఇటీవల ప్రకాష్ రాజ్ సమాధానమిచ్చారు. 

రీసెంట్ గా జరిగిన మీడియా సమావేశంలో ఆయన మరో క్లారిటీ ఇచ్చారు. త్వరలో పార్టీ పేరును తెలియజేస్తానని అలాగే రానున్న బెంగుళూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్స్ లో కూడా పోటీలో పార్టీని నిలబెడతానని ప్రకాష్ రాజ్ వివరణ ఇచ్చారు. 

PREV
click me!

Recommended Stories

OTT: ఈ వారం ఓటీటీ రిలీజ్ లు.. జ్యోతిక నటించిన కోర్ట్ రూమ్ థ్రిల్లర్ తో పాటు రొమాంటిక్ వెబ్ సిరీస్ లు రెడీ
Cannes 2026: గ్రీన్ గౌన్‌లో అదరగొట్టిన అదితి రావు హైదరి.. రాయల్ లుక్‌తో అప్సరసలా, వైరల్ ఫొటోస్