డైరెక్షన్ వదిలేస్తున్నా... ప్రభుదేవా షాకింగ్ డెసిషన్!

By team teluguFirst Published Sep 21, 2021, 12:21 PM IST
Highlights


 
ప్రభుదేవా ఇకపై మెగాఫోన్ పట్టకూడని డిసైడ్ అయ్యారట. నటనపై పూర్తి దృష్టి సారించి, డైరెక్షన్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. దర్శకుడిగా ప్రభుదేవా గత చిత్రాలు అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. 

కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆయన ఇకపై మెగాఫోన్ పట్టకూడని డిసైడ్ అయ్యారట. నటనపై పూర్తి దృష్టి సారించి, డైరెక్షన్ కి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారట. దర్శకుడిగా ప్రభుదేవా గత చిత్రాలు అట్టర్ ప్లాప్ టాక్ తెచ్చుకున్నాయి. సల్మాన్ ఖాన్ తో ఆయన చేసిన దబాంగ్ 3 ప్లాప్ టాక్ తెచ్చుకోగా, లేటెస్ట్ రిలీజ్ రాధే విమర్శలపాలైంది.  


సల్మాన్ కెరీర్ లోనే వరస్ట్ మూవీగా రాధే ని ప్రేక్షకులు, క్రిటిక్స్ అభివర్ణించారు. ప్రభుదేవా ఇమేజ్ ని రాధే ఫుల్ డామేజ్ చేసింది. దీనితో ఇకపై దర్శకత్వం జోలికి పోకూడదని ప్రభుదేవా నిర్ణయించుకున్నారు. 2005లో విడుదలైన నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రంతో ప్రభుదేవా దర్శకుడిగా మారారు. సిధార్థ, త్రిష కాంబినేషన్ లో తెరకెక్కిన ఆ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 
ఆ తరువాత ప్రభాస్ తో పౌర్ణమి చేశారు. 

ఆ సినిమా అనుకున్నంత విజయం సాధించలేదు. తెలుగు హిట్ చిత్రం పోకిరి ని తమిళ్, హిందీ బాషలలో రీమేక్ చేసి మంచి హిట్స్ కొట్టారు ప్రభుదేవా. కెరీర్ లో బ్లాక్ బస్టర్ చిత్రాలు ఇచ్చిన ప్రభుదేవా కెరీర్ గ్రాఫ్ పడిపోవడం జరిగింది. ప్రస్తుతం ప్రభుదేవా పలు తమిళ చిత్రాలలో నటిస్తున్నారు.

click me!