చిరంజీవి, నాగార్జున దారిలో ప్రభాస్.. త్వరలో ఆ బిజినెస్!

By Siva KodatiFirst Published May 15, 2019, 1:32 PM IST
Highlights

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్తే. ఎందుకంటే ప్రభాస్ ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. 

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇది ప్రభాస్ అభిమానులకు సంతోషాన్నిచ్చే వార్తే. ఎందుకంటే ప్రభాస్ ఓ ఎంటర్టైన్మెంట్ ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. నాగార్జున, చిరంజీవి, మహేష్ లాంటి టాలీవుడ్ అగ్ర హీరోలు ఇప్పటికే ఎంటర్టైన్మెంట్ రంగంలో వ్యాపారం చేస్తున్నారు. చిరు, నాగ్ స్టార్ మా సంస్థలో భాగస్వాములుగా ఉన్న సంగతి తెలిసిందే. 

మహేష్ బాబు ఇటీవలే ఏఎంబి సినిమాస్ అంటూ మల్టిఫ్లెక్స్ ని ప్రారంభించాడు. తాజా సమాచారం ప్రకారం ప్రభాస్ తన స్నేహితులు వంశీ కృష్ణారెడ్డి, ఉప్పలపాటి ప్రమోద్ లతో కలసి టివి ఛానల్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. దీనిపై అధికారిక ప్రకటన రాకున్నా ఇండస్ట్రీలో ఈ వార్త వైరల్ అవుతోంది. 

ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ దర్శకత్వంలోని చిత్రం కూడా ప్రారంభమైంది. సాహోలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. రాధాకృష్ణ దర్శకత్వంలో తెరక్కుతున్న చిత్రంలో పూజ హెగ్డే హీరోయిన్. ఈ రెండు చిత్రాలు భారీ స్థాయిలో తెరకెక్కుతున్నాయి. సాహో చిత్రాన్ని ఆగష్టు 15న విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. 

click me!