ఆదిపురుష్‌ నుంచి ప్రభాస్‌ సర్‌ప్రైజ్‌.. ఏడువేల ఏళ్ళ క్రితం ఏం జరిగింది?

By Aithagoni RajuFirst Published Sep 2, 2020, 8:47 PM IST
Highlights

ప్రభాస్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో పైన పేర్కొన్నట్టు ఏడువేల ఏళ్ళ క్రితం ఓ తెలివైన రాక్షసుడు ఉండేవాడని పేర్కొన్నారు. ఇందులో  రేపు(గురువారం) ఉదయం 7గంటల 11 నిమిషాలకు మరో అప్‌డేట్‌ని పంచుకోనున్నారు.

`ఏడు వేల ఏళ్ళ క్రితం ప్రపంచంలోనే అత్యంత తెలివైన రాక్షసుడు ఉండేవాడు` అని అంటున్నారు పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌. ఆయన హీరోగా బాలీవుడ్‌లో `ఆదిపురుష్‌` చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. బాలీవుడ్‌ దర్శకుడు ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని టీ సిరీస్‌ పతాకంపై భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. 

ఇది పౌరాణిక నేపథ్యంలో రూపొందుతుంది. ఇందులో రాముడుగా ప్రభాస్‌ నటించనున్నారు. సీత పాత్ర కోసం అన్వేషణ జరుగుతుంది. పాన్‌ ఇండియా సినిమాగా దీన్ని హిందీతోపాటు తెలుగు, ఇతర సౌత్‌ భాషల్లో రూపొందించనున్నారు. ఇటీవల ఈ భారీ ప్రాజెక్ట్ ని ప్రకటించారు. తాజాగా మరో సర్‌ప్రైజ్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు ప్రభాస్‌.

 ఈ మేరకు ప్రభాస్‌ బుధవారం ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా ఓ పోస్ట్ పెట్టారు. ఇందులో పైన పేర్కొన్నట్టు ఏడువేల ఏళ్ళ క్రితం ఓ తెలివైన రాక్షసుడు ఉండేవాడని పేర్కొన్నారు. ఇందులో  రేపు(గురువారం) ఉదయం 7గంటల 11 నిమిషాలకు మరో అప్‌డేట్‌ని పంచుకోనున్నారు. బహుశా ఇందులో విలన్‌ పాత్రని రివీల్‌ చేసే అవకాశం ఉందని టాక్‌. దీంతో ప్రభాస్‌ సర్‌ ప్రైజ్‌ కోసం అభిమానులు ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం ప్రభాస్‌ పీరియాడికల్‌ లవ్‌ స్టోరీ `రాధే శ్యామ్‌` చిత్రంలో పూజా హెగ్డే తో కలిసి నటిస్తున్నారు. దీనికి వంశీ, ప్రమోద్‌తోపాటు కృష్ణంరాజు నిర్మాత. మరోవైపు `మహానటి` ఫేమ్‌ నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ఓ సైన్స్ ఫిక్షన్‌ చిత్రానికి ప్రభాస్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన విషయం తెలిసిందే.     
 

click me!