కేరళా కోసం ప్రభాస్‌ భారీ సాయం.. అస్సలు ఊహించరు..

Published : Aug 07, 2024, 10:22 AM IST
కేరళా కోసం ప్రభాస్‌ భారీ సాయం.. అస్సలు ఊహించరు..

సారాంశం

ప్రభాస్‌ ఏం చేసినా చాలా పెద్దగా చేస్తారు. ఫుడ్‌ పెట్టినా అలానే ఉంటుంది, సహాయం చేసినా అదే రేంజ్‌లో ఉంటుంది. ఇప్పుడు కేరళా కోసం ఆయన భారీ విరాళాన్ని ప్రకటించడం విశేషం.   

కేరళా రాష్ట్రాన్ని వరదలు అతలాకుతలం చేసిన విషయం తెలిసిందే. ప్రధానంగా వయనాద్‌ ప్రాంతం దారుణంగా దెబ్బతిన్నది. ఇప్పటికీ ఈ విషాదం నుంచి పూర్తిగా కోలుకోలేదు. ఇంకా సహాయక చర్యలు జరుగుతూనే ఉన్నాయి. వందల మంది ప్రజలు వరదలు కొట్టుకుపోయారు. ఊర్లకు ఊర్లే మునిగిపోవడం అత్యంత విషాదకరం. వందల్లో మృతులు ఉంటారని తెలుస్తుంది. వేలల్లో ప్రజలు నిరాశ్రయులయ్యారు. కేరళా ప్రభుత్వం వేగంగా సహాయక చర్యలు చేపడుతుంది. 

అదే సమయంలో కేరళా కోసం నిలబడుతున్నారు సెలబ్రిటీలు. ప్రధానంగా సినీ ప్రముఖులు కేరళాకి సహాయాలు అందిస్తున్నారు. తమవంతు ఆర్థిక సాయాన్ని సీఎం రిలీఫ్‌ ఫండ్‌కి అందిస్తున్నారు. ఇప్పటికే తెలుగు నుంచి చిరంజీవి, రామ్‌ చరణ్‌ కలిసి కోటీ రూపాయలు,  అల్లు అర్జున్‌ 25లక్షలు, రష్మిక మందన్నా పది లక్షలు, నిర్మాత నాగవంశీ ఐదు లక్షలు ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. హీరోయిన్‌ సంయుక్త మీనన్‌ కూడా కొంత విరాళాన్ని అందించింది. 

ఈ నేపథ్యంలో ఇప్పుడు డార్లింగ్‌ ప్రభాస్‌ స్పందించారు. ఆయన భారీ సహాయాన్ని ప్రకటించారు. ఏకంగా రెండు కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించడం విశేషం. ప్రభాస్‌ ఏది చేసినా చాలా పెద్దగా చేస్తారు. సాయం కూడా పెద్దగానే ఉంటుందనేలా ఆయన రెండు కోట్లు ఆర్థికసాయాన్ని ప్రకటించడం విశేషం. ఈ విషయాన్ని ఆయన పీఆర్‌ టీమ్‌ వెల్లడించింది. అంతేకాదు వయనాడ్‌ త్వరగా కోలుకోవాలని, ప్రజలు ధైర్యంగా ఉండాలని ఆయన వెల్లడించారు. జరిగిన ఘటనపై ప్రభాస్‌ విచారం వ్యక్తం చేశారు. 

మరోవైపు కేరళా కోసం ఇతర భాషల సెలబ్రిటీలు కూడా స్పందించారు. సూర్య, కార్తి, జ్యోతిక కలిసి యాభై లక్షలు అందించారు. విక్రమ్‌ 25 లక్షలు ఆర్థిక సాయం ప్రకటించారు. ఇక మాలీవుడ్‌ స్టార్స్ మమ్ముట్టి, దుల్కర్‌, మోహన్‌లాల్‌, వంటి మలయాళ తారలు కూడా కేరళ కోసం తమవంతు సాయాన్ని ప్రకటించారు. 
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

విజయ్ దళపతి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించబోతున్నాడా? జన నాయగన్ రన్ టైమ్ చూసి అభిమానులు షాక్
Motivational Dialogue: ఒక్కో డైలాగ్ ఒక్కో బుల్లెట్‌.. మ‌న‌సులో నుంచి పోవ‌డం క‌ష్టం