బాహుబలి పంపిన బిర్యానీ అంటూ ఉబ్బితబ్బిబ్బైన బెబో.. కరీనా దంపతులకు ప్రభాస్ ట్రీట్!

By team teluguFirst Published Sep 26, 2021, 6:41 PM IST
Highlights


కరీనా కపూర్(Kareena kapoor khan) దంపతులకు ప్రభాస్(Prabhas) డెలిషియస్ స్పెషల్ బిర్యానీ బహుమతిగా పంపారట. ప్రభాస్ ఆ విషయాన్ని కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 

డార్లింగ్ ప్రభాస్ ఆతిథ్యం గురించి అందరికీ తెలిసిందే. తన సినిమాలలో పని చేసే నటులకు ఆయన అరుదైన వంటకాలతో విందు భోజనం ఏర్పాటు చేస్తారు. గతంలో సాహో చిత్రంలో హీరోయిన్ గా పనిచేసిన శ్రద్దా కపూర్, రాధే శ్యామ్ మూవీలో ఓ కీలక రోల్ చేస్తున్న భాగ్యశ్రీకి ప్రభాస్ రుచికరమైన వంటకాలతో ట్రీట్ ఇవ్వడం జరిగింది. తాజాగా ఈ లిస్ట్ లో కరీనా కపూర్ దంపతులు చేరారు. 


కరీనా కపూర్ దంపతులకు ప్రభాస్ డెలిషియస్ స్పెషల్ బిర్యానీ బహుమతిగా పంపారట. ప్రభాస్ ఆ విషయాన్ని కరీనా కపూర్ ఖాన్ సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. బాహుబలి బిర్యానీ పంపారంటే అది ఎంత గొప్పగా ఉంటుందో... థాంక్ యూ ప్రభాస్ అంటూ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో కరీనా స్పందించారు. 


ఆదిపురుష్ మూవీలో కీలకమైన రావణాసురుడి పాత్రను సైఫ్ అలీఖాన్ చేస్తున్నారు. ఆ సాన్నిహిత్యంతో ప్రభాస్ సైఫ్, కరీనాల కోసం స్పెషల్ బిర్యానీ వంటకం పంపారు. ప్రస్తుతం ఆదిపురుష్ ముంబైలో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ సినిమా కోసం ప్రత్యేకమైన సెట్స్ నిర్మించడం జరిగింది. కెరీర్ లో మొదటిసారి ప్రభాస్ రాముడు పాత్ర చేస్తుండగా, కృతి సనన్ సీత పాత్ర చేస్తున్నారు. 


దర్శకుడు ఓం రౌత్ ఆదిపురుష్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. మరోవైపు రాధే శ్యామ్ షూటింగ్ పూర్తి చేశారు ప్రభాస్. ఈ మూవీ సంక్రాంతి కానుకగా 2022లో విడుదల కానుంది. అలాగే దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్ర షూటింగ్ లో సైతం ప్రభాస్ పాల్గొంటున్నారు. 

click me!