లండన్ ట్రిప్ కి వెళ్తోన్న అనుష్క, ప్రభాస్..!

By AN TeluguFirst Published Jul 29, 2019, 3:30 PM IST
Highlights

 ప్రభాస్, అనుష్కలను ఆన్ స్క్రీన్ మీద చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పబ్లిక్ గా వీరిద్దరూ కలిసి కనిపిస్తే అందరి కళ్లు వాళ్ల మీదే ఉంటాయి. 

దక్షిణాది అగ్ర తారలు ప్రభాస్, అనుష్కల మధ్య ఎఫైర్ నడుస్తుందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్నాయి. ఆన్ స్క్రీన్ మీద ఈ జంటని చూడడానికి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. పబ్లిక్ గా వీరిద్దరూ కలిసి కనిపిస్తే అందరి కళ్లు వాళ్ల మీదే ఉంటాయి.

ఫ్యాన్స్ కి ఈ కాంబినేషన్ అంటే అంత ఇష్టం. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఓ పబ్లిక్ ఈవెంట్ లో కనిపించబోతున్నారని సమాచారం. వివరాల్లోకి వెళితే.. ఈ ఏడాది అక్టోబర్ లో లండన్ లో 'బాహుబలి' సినిమా స్పెషల్ స్క్రీనింగ్ ని ఏర్పాటు చేస్తున్నారు. ప్రఖ్యాతి చెందిన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో 'బాహుబలి'ని స్క్రీన్ చేయబోతున్నారు. 

సినిమా స్క్రీనింగ్ తరువాత నిర్వాహకులు రాజమౌళి, ప్రభాస్, అనుష్క, రానా, కీరవాణిలను కాసేపు ఆడియన్స్ తో ముచ్చటించాలని, వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలని అడగడంతో రాజమౌళి అండ్ కో అంగీకరించిందని తెలుస్తోంది. దీనికోసం త్వరలోనే వీరందరూ కలిసి లండన్ కి పయనించనున్నారు. ప్రస్తుతం ప్రభాస్ 'సాహో' సినిమాలో నటిస్తున్నాడు.

ఆగస్ట్ 30న సినిమాను విడుదల చేయనున్నారు. అక్టోబర్ నాటికి ప్రభాస్ ఫ్రీగా ఉంటాడు కాబట్టి లండన్ కి వెళ్లడానికి ఎలాంటి అభ్యంతరాలు పెట్టలేదట. ఇక అనుష్క తన తదుపరి సినిమా షూటింగ్ కోసం అమెరికా వెళ్లింది. షూటింగ్ పూర్తి కాగానే ఇండియా తిరిగొచ్చి లండన్ లో 'బాహుబలి' సినిమాను ప్రమోట్ చేయబోతుంది.  

click me!