గుండెపోటుతో పాపులర్‌ పాటల రచయిత కన్నుమూత.. సీఎం సంతాపం

Published : Nov 27, 2021, 08:28 AM IST
గుండెపోటుతో పాపులర్‌ పాటల రచయిత కన్నుమూత.. సీఎం సంతాపం

సారాంశం

మలయాళానికి చెందిన దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల(80) శుక్రవారం తుదిశ్వాస విడిచారు.గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తుంది. 

చిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటు చేసుకుంది. పాపులర్‌ పాటల రచయిత కన్నుమూశారు. మలయాళానికి చెందిన దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల(80)(Bichu Thirumala) శుక్రవారం తుదిశ్వాస విడిచారు. గుండెపోటు కారణంగా ఆయన మరణించినట్టు తెలుస్తుంది. శుక్రవారం ఆయనకు హార్ట్ ఎటాక్‌ రావడంతో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ Bichu Thirumala మరణించారు. దిగ్గజ పాటల రచయిత బిచు తిరుమల మరణం పట్ల కేరళా సీఎం పినరయి విజయన్‌ సంతాపం తెలిపారు. ఆయన తన అద్భుతమైన పాటలతో శ్రోతలకు దగ్గరయ్యారని తెలిపారు. మరోవైపు ఎడ్యూకేషన్‌ మినిస్టర్‌ వి శివన్‌ కుట్టి కూడా తమ తీవ్ర సంతాపాన్ని తెలియజేశారు. 

బి. శివశంకరణ్‌ నాయర్‌గా జన్మించిన ఆయన సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. బిచు తిరుమలగా పాపులర్‌ అయ్యారు. 1941, ఫిబ్రవరి 13న త్రివేండ్రమ్‌లో జన్మించారు. 1970 నుంచి 1990 వరకు మలయాళ చిత్ర పరిశ్రమని పాటల రచయితగా ఓ వెలుగు వెలిగారని చెప్పొచ్చు. ఆయన ఇప్పటి వరకు మూడు వేలకు పైగా పాటలు రాశారు. అందులో చాలా వరకు ఆధ్యాత్మిక పాటలు కూడా ఉండటం విశేషం. `త్రిష్ణ`, `తేనుమ్‌ వయంబుమ్‌`, `కడింజూన్‌ కల్యాణం` అనే సినిమాల్లో పాటలకుగానూ ఆయన రెండు సార్లు కేరళ స్టేట్‌ ఫిల్మ్ అవార్డులను కూడా సొంతం చేసుకున్నారు. 

ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎస్‌ విశ్వనాథన్‌, శంకర్‌-గణేష్‌, ఏ.ఆర్‌ రెహ్మాన్‌, ఇళయరాజా వంటి అనేక మంది సంగీత దర్శకులతో ఆయన పనిచేశారు. 1972 నుంచి ఇప్పటి వరకు పాటలు రాస్తూనే ఉన్నారు. పాటల రచయితగా, పోయెట్‌గా, ఆథర్‌గా, స్క్రిప్ట్ రైటర్‌గా, స్క్రీన్‌ రైటర్‌గా, మ్యూజిక్‌ కంపోజర్‌గా, సింగర్‌గానూ రాణించారు. బిచు తిరుమల మృతి పట్ల మలయాళ చిత్ర ప్రముఖులు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నారు. 

also read: విషాదంః ప్రముఖ దర్శకుడు కె.ఎస్‌.నాగేశ్వరరావు కన్నుమూత ..

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Double Elimination: బిగ్‌ బాస్‌ తెలుగు 9 డబుల్‌ ఎలిమినేషన్‌, 14వ వారం ఈ ఇద్దరు ఔట్‌.. టాప్‌ 5 కంటెస్టెంట్లు వీరే
Nagababu: సౌత్ ఆఫ్రికా నుంచి ఫోన్ చేసిన స్టార్ హీరో.. నాగబాబు, భరణి ఇద్దరి సమస్య ఒక్కటే.. అందుకే ఈ బంధం