ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? నెటిజన్ పై పూనమ్ ఫైర్!

Published : Oct 06, 2018, 12:35 PM IST
ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? నెటిజన్ పై పూనమ్ ఫైర్!

సారాంశం

నటిగా పూనమ్ కౌర్ కి సరైన బ్రేక్ దక్కలేదు. ప్రస్తుతం ఫోటోషూట్లతో కాలం గడుపుతున్న ఆమె ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్లు వివాదాలకి దారి తీశాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

నటిగా పూనమ్ కౌర్ కి సరైన బ్రేక్ దక్కలేదు. ప్రస్తుతం ఫోటోషూట్లతో కాలం గడుపుతున్న ఆమె ట్విట్టర్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ ని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్లు వివాదాలకి దారి తీశాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల రాజకీయాలని ఉద్దేశించి ఆమె చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

''ఆంధ్ర, తెలంగాణా.. మన వాళ్లే గొడవ పడుతూ ఉంటే లాభం ఎవరికి..? నాకైతే ఏం అర్ధం కావడం లేదు. ఇదిగో ఈ స్కూల్ స్టోరీ గుర్తుకొచ్చింది'' అంటూ రెండు పిల్లుల తగాదాను కోతి తీర్చిన ఫోటోని పోస్ట్ చేసింది.

దీనిపై స్పందించిన ఓ నెటిజన్.. ''ఓటుకి నోటు వల్ల లాభం ఎవరికి..? చాలా ఇమెచ్యూర్డ్‌ పొలిటికల్ ట్వీట్ ఇది. మీరు ఎంత అన్నా.. మీ వల్ల టీడీపీకి ఒక్క ఓటు కూడా రాదు'' అని ట్వీట్ చేశారు.

దీనిపై స్పందించిన పూనమ్.. ''నువ్వు ఎవరి డీపీ(వైఎస్ రాజశేఖర్ రెడ్డి) పెట్టుకున్నావో.. ఆయన విలువైనా తీయకు. ఇదేమైనా సినిమానా పంచ్ లు వేయడానికి..?'' అంటూ సదరు నెటిజన్ కి క్లాస్ తీసుకుంది!

PREV
click me!

Recommended Stories

విజయ్ - రష్మిక ఇద్దరిలో ముందు ప్రపోజ్ చేసింది ఎవరో తెలుసా? సీక్రెట్ చెప్పిన విజయ్ దేవరకొండ
ఇండస్ట్రీ హిట్ సినిమాని తన భార్యకి రాసిచ్చిన చిరంజీవి.. కమెడియన్ కి సాయం చేయబోయి నిందలు పడ్డ మెగాస్టార్