ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం గురించిన అప్ డేట్ పూజా హెగ్డే రివీల్ చేసింది. ‘సాహో’ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రానికి సంబంధించిన తొలి టీజర్ రానుంది. ఈ విషయాన్ని హీరోయిన్ పూజా హెగ్దే స్వయంగా తెలిపింది. రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజా హెగ్దే జంటగా నటిస్తోన్న ‘రాధే శ్యామ్’ టీజర్ వస్తుందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
ఈ వార్తలను నిజం చేస్తూ పూజా హెగ్దే ట్విట్టర్ వేదికగా ఓ ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ ని టీమ్ అనుమతితో వేసిందని, డైరక్టరే సలహా ఇచ్చారని, పూజా ద్వారా అయితే ఎక్కువ మందికి రీచబులిటీ ఉంటుందని ఇలా రివీల్ చేసారంటున్నారు. అదే మీడియాలో ప్రెస్ నోట్ ఇవ్వటం కన్నా ఇది బెస్ట్ అని టీమ్ భావించారని చెప్తున్నారు. ఇప్పుడు మీడియా తనంతట తానే ఈ వార్తను కవర్ చేస్తుందనేది టీమ్ ఆలోచన.
రాధేశ్యామ్ చిత్ర టీజర్ కోసం డబ్బింగ్ చెప్తోన్న సమయంలో తీసిన ఫొటోను పోస్ట్ చేస్తూ.. ‘ఉదయాన్నే మా టీజర్ కోసం డబ్బింగ్ చెప్తున్నాను. ఫిబ్రవరి 14న టీజర్ రానుంది’ అంటూ క్యాప్షన్ జోడించిందీ బ్యూటీ. ఈ అందమైన ప్రేమ కథ టీజర్ను ప్రేమికుల దినోత్సవం రోజు విడుదల చేస్తుండడంతో ప్రభాస్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. ఇక పాన్ ఇండియా స్దాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. మరి సినిమా ఫస్ట్లుక్తోనే సంచలనం సృష్టించిన ‘రాధేశ్యామ్’ టీజర్తో ఎలాంటి రికార్డులు తిరగరాస్తుందో చూడాలంటున్నారు అభిమానులు.
అలాగే ఈ నెల 14న ప్రేమికుల దినోత్సవ కానుకగా ‘రాధేశ్యామ్’ టీజర్ రిలీజ్ చేస్తున్న చిత్ర టీమ్.. అప్పుడే రిలీజ్ డేట్ కూడా ప్రకటించే అవకాసం ఉందని మీడియా అంటోంది. ఈ నేపధ్యంలో ఈ చిత్రం రిలీజ్ డేట్ అంటూ ఒకటి ప్రచారంలోకి వచ్చింది.
ప్రభాస్ లాస్ట్ పిల్మ్ ‘సాహో’ సినిమా అంతగా వర్కవుట్ కాకపోవటంతో అభిమానుల చూపంతా ‘రాధేశ్యామ్’ పైనే ఉంది. ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ‘జిల్’ సినిమా తెరకెక్కించిన రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. వహిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, టీ-సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. పిరియాడికల్ లవ్ డ్రామాగా తెరకెక్కుస్తున్న ఈ సినిమాలో అందాల భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది.
ప్రస్తుతం హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్ లో షూటింగ్ జరుగుతోంది. తెలుగు, మలయాళం, హిందీ, తమిళ, కన్నడ భాషల్లో రాధేశ్యామ్ ను విడుదల చేయడానికి చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. దాంతో మిగతా భాషల్లో రిలీజ్ అయ్యే సినిమాల రిలీజ్ లు చూసుకుని ఈ డేట్ ఫిక్స్ చేయాల్సిన అవసరం ఉంది. మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు జూలై 30న ‘రాధేశ్యామ్’ విడుదలవుతుందని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ చిత్రం బిజినెస్ ఇప్పటికే ఊపందుకుంది. ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు.. ‘రాధేశ్యామ్’ చిత్రం ఓవర్ సీస్ రైట్స్ ని ప్రీమియర్ డిస్ట్రిబ్యూటర్ గ్రేట్ ఇండియా ఫిల్మ్స్ వారు సొంతం చేసుకున్నారు. వారు 22 కోట్లకు ఈ రైట్స్ ని సొంతం చేసుకున్న వార్త. ఈ కరోనా టైమ్ లో ఇది అది పెద్ద విషయం. ఇప్పటి వరకు కేవలం ఓవర్ సీస్ సినిమా పంపిణీలోనే అడ్వాన్స్ లేకుండా ఫుల్ పేమెంట్ తో సినిమా బిజినెస్ జరుగుతుంది. ఈ సినిమాకు అలాగే జరిగిందని తెలుస్తోంది.
నటీనటులు: ప్రభాస్, పూజా హెగ్డే, సత్యరాజ్, భాగ్యశ్రీ, కునాల్ రాయ్ కపూర్, జగపతిబాబు, జయరాం, సచిన్ ఖేడ్కర్, భీనా బెనర్జి, మురళి శర్మ, శాషా ఛత్రి, ప్రియదర్శి, రిద్దికుమార్, సత్యాన్ తదితరులు సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ : మనోజ్ పరమహంస ఎడిటర్ : కొటగిరి వెంకటేశ్వరావు యాక్షన్, స్టంట్స్ : నిక్ పవల్, సౌండ్ డిజైన్ : రసూల్ పూకుట్టి కొరియోగ్రఫి : వైభవి మర్చంట్ కాస్ట్యూమ్స్ డిజైనర్ : తోట విజయ భాస్కర్ అండ్ ఎకా లఖాని వి ఎఫ్ ఎక్స్ సూపర్వైజర్ : కమల్ కన్నన్ ఎక్జిక్యూటివ్ ప్రోడ్యూసర్ : ఎన్.సందీప్, హెయిర్స్టైల్ : రోహన్ జగ్టప్ మేకప్ : తరన్నుమ్ ఖాన్ స్టిల్స్ : సుదర్శన్ బాలాజి పబ్లిసిటి డిజైనర్ : కబిలాన్ పి ఆర్ ఓ : ఏలూరు శ్రీను కాస్టింగ్ డైరక్టర్ : ఆడోర్ ముఖర్జి ప్రోడక్షన్ డిజైనర్ : రవీందర్ చిత్ర సమర్పకులు : "రెబల్స్టార్" డాక్టర్ యు వి కృష్ణంరాజు నిర్మాతలు: వంశీ, ప్రమోద్, ప్రశీదా దర్శకుడు : రాధాకృష్ణ కుమార్.