జలుబు,దగ్గుతో పూజా హెగ్డే రెస్ట్ ,షూటింగ్ బ్రేక్?

Surya Prakash   | Asianet News
Published : Nov 21, 2020, 05:32 PM ISTUpdated : Nov 21, 2020, 05:33 PM IST
జలుబు,దగ్గుతో పూజా హెగ్డే రెస్ట్ ,షూటింగ్ బ్రేక్?

సారాంశం

 ప్రస్తుతం ముంబైలో పూజ రెస్ట్ తీసుకుంటోంది. ఇటలీలో కంటిన్యూ షెడ్యూల్ చేసి వచ్చాక ఆమె రెస్ట్ తీసుకోవాలేదు. అయితే ఇప్పుడు ఈ అవకాసం ఇలా వచ్చిందంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే కేవలం క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ ఉంది. హీరోయిన్ వచ్చేస్తే వాళ్లు దాన్ని ఫినిష్ చేసేస్తారు.

కరోనా సినిమా వాళ్లను బాగా భయపెడుతోంది. చిన్న దగ్గు,తుమ్ము వచ్చినా రెస్ట్ తీసేసుకుంటున్నారు. ఎవరు రిస్క్ తీసుకోవాటనికి ఆసక్తి చూపటం లేదు. తెలుగులో స్టార్ గా వెలుగుతున్న పూజా హెగ్డే కూడా  ప్రస్తుతం అదే పరిస్దితి అని తెలుస్తోంది. రాధేశ్యామ్ షూటింగ్ అనేక జాగ్రత్తలతో చేసి వచ్చిన ఆమె ఇప్పుడు వాస్తవానికి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా షూటింగ్ లో పాల్గొనాలి. కానీ కాస్త జలుబు, దగ్గు ఉండటంతో రిస్క్ తీసుకోవటం ఇష్టం లేక ఇంట్లో రెస్ట్ తీసుకుంటోందని తెలుస్తోంది. 

దాంతో షూటింగ్ కాన్సిల్ చేసారట టీమ్. దాంతో ప్రస్తుతం ముంబైలో పూజ రెస్ట్ తీసుకుంటోంది. ఇటలీలో కంటిన్యూ షెడ్యూల్ చేసి వచ్చాక ఆమె రెస్ట్ తీసుకోవాలేదు. అయితే ఇప్పుడు ఈ అవకాసం ఇలా వచ్చిందంటున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా విషయానికి వస్తే కేవలం క్లైమాక్స్ మాత్రమే పెండింగ్ ఉంది. హీరోయిన్ వచ్చేస్తే వాళ్లు దాన్ని ఫినిష్ చేసేస్తారు.
 
ఇక పూజా హెగ్డే అందం చూస్తే కళ్లు తిప్పుకోలేం. ఆమె నటనకి ఎక్కడా వంక పెట్టలేం. ఆమె మాటలు ముద్దు ముద్దుగా ఉంటాయి. అదే సమయంలో ఆమె కళ్లు వేల భావాల్ని పలికిస్తాయంటారు అబిమానులు. ఆ ఎక్సప్రెషన్స్ ఆ క్యారక్టర్స్ కే  కొత్త వన్నెని తీసుకొస్తాయి. అందుకే పూజ బాలీవుడ్‌ నుంచి టాలీవుడ్‌ దాకా సూపర్‌హిట్టు అయ్యింది ఈ బుట్టబొమ్మ ‘అల వైకుంఠపురములో’ సినిమాతో కుర్రాళ్ల హృదయాల్ని కొల్లగొట్టింది. ప్రస్తుతం ప్రభాస్‌, అఖిల్‌లతో కలిసి ఆడిపాడుతోంది. మరోపక్క బాలీవుడ్‌లోనూ స్టార్ హీరోల సరసన అవకాశాల్ని అందుకొంటోంది. 
 

PREV
click me!

Recommended Stories

బాహుబలి కంటే ముందు రమ్యకృష్ణ కెరీర్ లో ఐకానిక్ మూవీ.. 25 ఏళ్ళ తర్వాత తొలిసారి థియేటర్ లో చూస్తూ, వైరల్
అన్ని అనుభవించాలన్నదే నా కోరిక.. స్టార్ హీరోయిన్ ఓపెన్ కామెంట్స్