నిన్న (ఏప్రిల్28) ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది భారీ బడ్జెట్ .. పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. మిక్స్ టాక్ తెచ్చుకున్న ఈసినిమా.. తాజాగా ఓటీటీ పార్ట్నర్ ను కూడా లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది.
కోలీవుడ్ స్టార్ సీనియర్ డైరెక్టర్ మణిరత్నం తెరకెక్కించిన భారీ బడ్జెట్ మూవీ పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. తమిళనాట ప్రెస్టీజియస్ గా తెరకెక్కిన పొన్నియిన్ సెల్వన్ రెండు భాగాలుగా రూపొందగా.. గతంలో పార్ట్ 1 రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకుంది. ఇక నిన్న ( ఏప్రిల్28) పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2 మూవీని ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ చేశారు టీమ్. ఈ హిస్టారికల్ మూవీకి తమిళ ప్రేక్షకులు మాత్రమే ఎక్కువగా పట్టం కట్టారు. మిగిలిన చోట్ల పొన్నియన్ సెల్వన్ మూవీకి మిక్స్డ్ టాక్ వస్తోంది.
విక్రమ్, జయం రవి, కార్తీ, త్రిష, ఐశ్వర్య రాయ్ ,త్రిష, ప్రకాశ్ రాజ్, వంటి స్టార్ కాస్ట్ నటిస్తుండటంతో.. ఈసినిమాను చూడటానికి ఆడియన్స్ ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాగా ఈసినిమా ఇప్పటికే డిజిటల్ రిలీజ్ కు అంతా సిద్ధం అయినట్టు తెలుస్తోంది. పొన్నియన్ సెల్వన్ 2కి సంబంధించిన ఓటీటీ పార్ట్నర్ను మూవీ టీమ్ ఇప్పటికే లాక్ చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ రైట్స్ను సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు స్ట్రీమింగ్ చేస్తారనేది మాత్రం ఇంత వరకూ ప్రకటించలేదు.
ఫిల్మ్ వర్గాల సమాచారం ప్రకారం ఈ సినిమాను జూన్ ప్రారంభంలో స్ట్రీమింగ్ చేయనున్నారని తెలుస్తోంది.అతి త్వరలోనే ఈమూవీ ప్రైమ్ లో స్క్రీమింగ్ అవ్వడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్టు సమాచారం. అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ చిత్రానికి ఏఆర్.రెహమాన్ సంగీతం అందించాడు.మణిరత్నం కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన సినిమాగా పొన్నియిన్ సెల్వన్ నిలిచిపోయింది. ఓ రకంగా చెప్పాలంటే ఇది ఆయన కలల ప్రాజెక్టు. ప్రముఖ తమిళ రచయిత కల్కీ రాసిన పొన్నియిన్ సెల్వన్ నవల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. 1980వ దశకం నుంచి సినిమాను వెండితెరపై ఆవిష్కరించాలనకున్న ఆయన.. ఆ కలను దాదాపు 40 ఏళ్ల తర్వాత నెరవేర్చుకున్నారు.దానిక కారణం కూడా రాజమౌళి బాహుబలి చేయడమే అని ప్రకటించారు మణిరత్నం.