విశాల్ కు హిందూ సంస్థల హెచ్చరిక

First Published May 12, 2018, 12:38 PM IST
Highlights

విశాల్ కు హిందూ సంస్థల హెచ్చరిక

మిత్రన్ దర్శకత్వంలో విశాల్ నటించిన తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’ చిత్రం విడుదలైంది. ఆధార్ కార్డుకు సంబంధించి తప్పుడు సమాచారమే కాకుండా కేంద్ర ప్రభుత్వ ‘డిజిటల్ ఇండియా’పై ఈ చిత్రంలో విమర్శించినట్టు హిందూ సంస్థలు ఆరోపిస్తూ మద్రాసు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ వేసిన పిటిషన్ ను హైకోర్టు తోసి పుచ్చింది. దీనిపై నిరసన వ్యక్తం చేస్తున్న హిందూ సంస్థలు హీరో విశాల్ ఇంటిని ముట్టడించనున్నట్టు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో విశాల్ ఇంటికి పోలీసులు భద్రత కల్పించారు. కాగా, ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చింది. మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయని కోలీవుడ్ వర్గాల సమాచారం.

click me!