స్నేహితుడిని మోసం.. హీరో సచిన్‌ జోషీపై కేసు నమోదు..

Published : Jan 10, 2021, 08:43 PM ISTUpdated : Jan 10, 2021, 11:49 PM IST
స్నేహితుడిని మోసం..  హీరో సచిన్‌ జోషీపై కేసు నమోదు..

సారాంశం

టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్‌ జోషి తన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వితో కలిసి వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది.   

హీరో సచిన్‌ జోషీపై కేసు నమోదైంది. పుణెలోని ఓ పోలీస్‌ స్టేషన్‌లో ఆయన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వి ఫిర్యాదు చేశారు. చెల్లింపుల విషయంలో తలెత్తిన వివాదం విషయంలో పరాగ్‌ సంఘ్వి.. సచిన్‌ జోషిపై ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు. టాలీవుడ్‌, బాలీవుడ్‌లో అడపాదడపా సినిమాలు చేస్తూ హీరోగా రాణిస్తున్న సచిన్‌ జోషి తన స్నేహితుడు పరాగ్‌ సంఘ్వితో కలిసి వైకింగ్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కంపెనీని రన్‌ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఓ ఒప్పందం జరిగింది. 

ఈ ఒప్పందం ప్రకారం ఇంటర్నేషనల్‌ రిసార్ట్ కోరేగావ్‌ పార్క్‌కు రూ.58కోట్లు రాయల్టీ చెల్లించాల్సి ఉంది. కానీ 2016 నుంచి పరాగ్‌ సంఘ్వికి సచిన్‌ జోషి ఎలాంటి చెల్లింపులు చేయలేదు. దీనిపై అతను పుణె పోలీసులకు ఫిర్యాదు చేశారు. సంఘ్వి ఫిర్యాదు మేరకు పుణె పోలీస్‌ క్రైమ్‌ బ్రాంచ్‌కి చెందిన ఆర్థిక నేరాల విభాగం దర్యాప్తు చేస్తుంది. ఈ దర్యాప్తులో భాగంగా జోషిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. మరోవైపు వైకింగ్‌ మీడియా అండ్‌ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి సంస్థలో పనిచేసే ముప్పై మంది మాజీ ఉద్యోగులకు సచిన్‌ జీతాలు ఇవ్వలేదనే ఆరోపణలు వచ్చాయి. దీంతోపాటు ఆ మధ్య గుట్కా అక్రమ రవాణా చేస్తున్నారనే ఆరోపణల్లో హైదరాబాద్‌ పోలీసులు సచిన్‌ని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. 

`మౌనమేలనోయి` చిత్రంతో హీరోగా తెలుగు తెరకి పరిచయమైన సచిన్‌ జోషి `నిను చూడక నేనుండలేను`, `ఒరేయ్‌ పండు` వంటి చిత్రాల్లో నటించారు. ఆ తర్వాత హిందీలో `ఆజాన్‌`, `ముంబయి మిర్రర్‌`, `జాక్‌పాట్‌` చిత్రాలు చేశాడు. మళ్లీ టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చి `నీ జతగా నేనుండాలి`, `మొగలిపువ్వు`, `వీరప్పన్‌`, `వీడెవడు`, `అమవాస్‌` చిత్రాల్లో నటించాడు. `వీడెవడు` మంచి విజయం సాధించింది. `నెక్ట్స్ ఎంటీ` చిత్రానికి నిర్మాతగా పనిచేశారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Thanuja: దిమ్మ తిరిగే ట్విస్ట్, తనూజకి ఫైనలిస్ట్ గా నో ఛాన్స్.. నేనూ మనిషినే, ఇమ్మాన్యుయేల్ ఎమోషనల్
Vahini Battles Cancer : విషమంగా సీనియర్ నటి ఆరోగ్య పరిస్థితి, సహాయం కోసం ఎదురుచూపులు