సూపర్ స్టార్ రజనీకాంత్కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిప్రకాష్ జవదేకర్ ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా రజనీకి అభినందనలు తెలిపారు.
సూపర్ స్టార్ రజనీకాంత్కి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం దక్కిన విషయం తెలిసిందే. గురువారం కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రిప్రకాష్ జవదేకర్ ఈ అత్యున్నత పురస్కరాన్ని ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీ తాజాగా రజనీకి అభినందనలు తెలిపారు. రజనీ చేసిన సేవలను గుర్తు చేస్తూ ఆయనకు విషెస్ తెలిపారు.
`తరతరాలుగా ప్రాచుర్యం పొందిన వారిగా కొంతమందినే గొప్పగా చెప్పుకోవచ్చు. విభిన్నమైన పాత్రలు, అద్భుతమైన వ్యక్తిత్వం కలిసి రజనీకాంత్గారు అందులో ఒకరు. భారతీయ సినిమాకి విశేషమైన సేవలందించిన తలైవాకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు లభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయనకు అభినందనలు` అని తెలిపారు ప్రధాని నరేంద్రమోడి.
Popular across generations, a body of work few can boast of, diverse roles and an endearing personality...that’s Shri Ji for you.
It is a matter of immense joy that Thalaiva has been conferred with the Dadasaheb Phalke Award. Congratulations to him.
దీంతో అనేక మంది సినీ తారలు రజనీకాంత్కి అభినందనలు తెలియజేస్తున్నారు. అదే సమయంలో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తమిళనాడు ఎన్నికలు ముందు రజనీకాంత్కి ఈ అవార్డుని ప్రకటించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. రజనీకి తమిళనాట భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇది ఎన్నికల్లో ఓట్ల గేమ్ అని, ఓటుకి, అవార్డుతో ముడిపెట్టారనే విమర్శలు వినిపిస్తున్నాయి.