నాగార్జునకి తలనొప్పి.. హైకోర్టుకి బిగ్ బాస్ టీమ్!

By AN TeluguFirst Published Jul 16, 2019, 1:04 PM IST
Highlights

మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 3 షోని వివాదాలు చుట్టుముట్టాయి. 

మరికొద్ది రోజుల్లో మొదలుకానున్న బిగ్ బాస్ సీజన్ 3 షోని వివాదాలు చుట్టుముట్టాయి. బిగ్ బాస్ హౌస్ లో కాస్టింగ్ కౌచ్ ఉందంటూ యాంకర్ శ్వేతా రెడ్డి, నటి గాయత్రి గుప్తాలు పోలీస్ స్టేషన్ లో కేసులు పెట్టారు. దీంతో బిగ్ బాస్ టీమ్ హైకోర్టుని ఆశ్రయించింది.

బిగ్ బాస్ నిర్వాహకులుక్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. పోలీస్ స్టేషన్ లలో నమోదైన కేసులను కొట్టేయాలని పిటిషన్ వేశారు. మరోపక్క బిగ్ బాస్ 3 నిలిపివేయాలని హైకోర్టులో కొందరు పిల్ దాఖలు చేశారు.

సినిమాలాగా ఎపిసోడ్ లను సెన్సార్ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నాగార్జున పాటు 10 మందిని ప్రతివాదులుగా పిటిషనర్ పేర్కొన్నారు. రాత్రి 11 గంటల తర్వాతే ప్రోగ్రాంను ప్రసారం చేయాలని పిటిషనర్ రిక్వెస్ట్ చేస్తున్నారు. మరి ఈ విషయంపై కోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి! 

click me!