మంచి మాటలకు ధన్యవాదాలుః మహేష్‌ ట్వీట్‌కి పీవీ సింధు స్పందన

By Aithagoni RajuFirst Published Aug 4, 2021, 9:01 AM IST
Highlights

మహేష్‌తోపాటు చిరంజీవి, అనసూయ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అభినందించారు. వీరికి ధన్యవాదాలు చెబుతుంది పీవీ సింధు. ఒక్కొక్కరికి పర్సనల్‌గా ఆమె థ్యాక్స్ చెప్పడం విశేషం. 
 

బ్యాక్‌ టూ బ్యాక్‌ రెండు ఒలింపిక్ మెడల్స్ సాధించిన మహిళగా చరిత్ర సృష్టించిన బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధుకి దేశం నలుమూలల నుంచి ప్రశంసలు, అభినందనలు దక్కుతున్నాయి. సినిమా, రాజకీయ ప్రముఖులు, సాధారణ ప్రజానికం అనే తేడా లేకుండా అందరు ఆమెని అభినందిస్తున్నారు. అందులో భాగంగా సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు సైతం పీవీ సింధుని అభినందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా ప్రశంసలు కురిపించారు. 

`మరో చారిత్రాత్మక విజయం. భారతదేశానికిది అత్యత్తమ విజయం. కాంస్యం గెలిచినందుకు అభినందలు పీవీ సింధు. చాలా సంతోషంగా, గర్వంగా ఉంది` అని ట్వీట్‌ చేశారు మహేష్‌. మహేష్‌తోపాటు చిరంజీవి, అనసూయ ఇలా చాలా మంది సినీ ప్రముఖులు అభినందించారు. వీరికి ధన్యవాదాలు చెబుతుంది పీవీ సింధు. ఒక్కొక్కరికి పర్సనల్‌గా ఆమె థ్యాక్స్ చెప్పడం విశేషం. 

మహేష్‌ ట్వీట్‌కి స్పందిస్తూ, `మీ మంచి మాటలకు చాలా ధన్యవాదాలు మహేష్‌బాబు. నేను దానికి విపరీతంగా అభినందిస్తున్నా` అని తెలిపింది పీవీ సింధు. ప్రస్తుతం ఈ ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. దీంతో మహేష్‌ ఫ్యాన్స్ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు. ఇక టోక్యోలో జరుగుతున్న ఒలింపిక్స్ లో సెమీ ఫైనల్‌లో ఓడిన పీవీ సింధు కాంస్యం కోసం చైనాకి చెందిన హీ బింగ్‌ జియావో తో తలపడి విజయం సాధించింది. ఇది ఇండియాకి మరపురాని విజయంగా నిలిచింది. 

Thank you so much for your kind words , I appreciate it immensely! 🙏 https://t.co/7ozX6sSm31

— Pvsindhu (@Pvsindhu1)

మహేష్‌ ప్రస్తుతం `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుండగా, పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14రీల్స్ ప్లస్‌ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కానుంది. మహేష్‌ బర్త్ డే సందర్భంగా సినిమాకి సంబంధించిన అప్‌డేట్‌ ఇవ్వబోతున్నారు. 

click me!