భూములు కొన్న ఎన్టీఆర్ తహశీల్దార్ కార్యాలయంలో సందడి

By team teluguFirst Published Jul 31, 2021, 7:44 AM IST
Highlights

గోపాలపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఎన్టీఆర్ ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయానికి శుక్రవారం ఎన్టీఆర్ వచ్చారు. 


ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ లో బిజీగా ఉన్న ఎన్టీఆర్ తహశీల్దార్ కార్యాలయంలో కనిపించి సందడి చేశారు. ఆరున్నర ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ పనుల కోసం ఆయన తహశీల్దార్ కార్యాలయానికి వచ్చినట్లు తెలుస్తుంది. గోపాలపురం గ్రామ రెవెన్యూ పరిధిలో ఎన్టీఆర్ ఆరున్నర ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. ఈ భూమి రిజిస్ట్రేషన్ కోసం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి తహశీల్దార్ కార్యాలయానికి శుక్రవారం ఎన్టీఆర్ వచ్చారు. 


ఎన్టీఆర్ ని చూసిన తహశీల్దార్ కార్యాలయం అధికారులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆయనతో ఫోటోలు దిగడానికి సిబ్బంది పోటీపడ్డారు. ఎన్టీఆర్ రాకను తెలుసుకున్న అభిమానులు సైతం అక్కడకు చేరుకున్నట్లు సమాచారం. రిజిస్ట్రేషన్ పనులు ముగిసిన అనంతరం ఎన్టీఆర్ అక్కడ నుండి తన నివాసానికి వెళ్లిపోయారు. తహశీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఎన్టీఆర్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. 


ఇక ఎన్టీఆర్ లేటెస్ట్ మూవీ ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ చివరి దశలో ఉంది. సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆలస్యం అయినప్పటికీ చెప్పిన విధంగా అక్టోబర్ 13న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. కేవలం పాటల చిత్రీకరణ మిగిలి ఉందని తెలుస్తుండగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. ఎన్టీఆర్, చరణ్ కొన్ని బాషలకు డబ్బింగ్ కూడా పూర్తి చేశారు. 


ఆర్ ఆర్ ఆర్ అనంతరం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల చిత్ర షూటింగ్ లో పాల్గొననున్నారు. అనంతరం ప్రశాంత్ నీల్ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ రెండు చిత్రాలు సైతం పాన్ ఇండియా లెవెల్ లో భారీగా తెరకెక్కనున్నాయి. 

click me!