ఎన్టీఆర్‌ హోస్ట్ `ఎవరు మీలో కోటీశ్వరులు` డేట్‌ ఫిక్స్.. మెగాస్టార్‌ బర్త్ డే టార్గెట్‌

Published : Aug 14, 2021, 02:23 PM IST
ఎన్టీఆర్‌ హోస్ట్ `ఎవరు మీలో కోటీశ్వరులు` డేట్‌ ఫిక్స్.. మెగాస్టార్‌ బర్త్ డే టార్గెట్‌

సారాంశం

ఈ రియాలిటీ షో ప్రారంభం కానుందని తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు. `వస్తున్న.. మీ ఇంటికి వచ్చేస్తున్నా.. ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గంటలకు `ఎవరు మీలో కోటీశ్వరులు`` అంటూ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. 

ఎన్టీఆర్‌ మరోసారి హోస్ట్ చేస్తున్న షో `ఎవరు మీలో కోటీశ్వరులు`. జెమినీ టీవీలో ఇది ప్రసారం కానుంది. గత నాలుగైదు నెలలుగా ఎప్పుడెప్పుడూ అంటూ ఊరిస్తుందీ షో. నిత్యం ప్రోమోలతో సందడి చేస్తున్నారు. `కమ్మింగ్‌ సూన్‌` అంటూ ప్రోమోలతోనే సరిపెడుతున్నారు. ఇంకా షో ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటూ నెటిజన్లు, ఎన్టీఆర్‌ అభిమానులు ట్రోల్స్, మీమ్స్ తో ట్రెండ్‌ చేస్తూ వస్తున్నారు. ఎట్టకేలకు నిర్వహకులు షో టెలికాస్ట్ డేట్‌ని ఫిక్స్ చేశారు. అందుకు మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డేని వేదికగా చేసుకోవడం విశేషం. 

అంటే ఈ నెల 22(ఆగస్ట్) నుంచి ఈ రియాలిటీ షో ప్రారంభం కానుందని తాజాగా మరో ప్రోమోని విడుదల చేశారు. `వస్తున్న.. మీ ఇంటికి వచ్చేస్తున్నా.. ప్రతి సోమవారం నుంచి గురువారం వరకు రాత్రి 8.30గంటలకు `ఎవరు మీలో కోటీశ్వరులు`` అంటూ ఎన్టీఆర్‌ క్లారిటీ ఇచ్చారు. ఇన్నాళ్ల నిరీక్షణకు తెరదించారు. దీంతో ఎన్టీఆర్‌ అభిమానులు కాస్త ఊరిపి పీల్చుకున్నారు. తమ అభిమాన హీరోని టీవీలో రోజూ చూసుకునే అవకాశం దక్కుతున్నందుకు ఖుషీ అవుతున్నారు. 

ఎన్టీఆర్‌ తెరపై కనిపించి మూడేళ్లవుతుంది. చివరగా ఆయన `అరవింద సమేత వీర రాఘవ` చిత్రంతో కనిపించారు. ఆ తర్వాత `ఆర్‌ఆర్‌ఆర్‌`లో బిజీ అయ్యారు. ఈ సినిమా పూర్తి కావడానికి మూడేళ్లు పట్టింది. దీంతో ఎన్టీఆర్‌ ని కనీసం బుల్లితెరపైనా చూసుకుందామని ఆయన అభిమానులు వెయిట్‌ చేస్తున్నారు. కానీ కరోనా కారణంగా `ఎవరు మీలో కోటీశ్వరులు` షో వాయిదా పడుతూ వస్తోంది. ఇప్పుడు ఎట్టకేలకు షోని ప్రారంభించేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు. ఆగస్ట్ 22 మెగాస్టార్‌ చిరంజీవి బర్త్ డే కావడం విశేషం. అయితే గత సీజన్‌కి(నాల్గో సీజన్‌)కి చిరంజీవి ఈ షోకి హోస్ట్ చేసిన విషయం తెలిసిందే. మొదటి మూడు సీజన్స్ కి నాగార్జున హోస్ట్ గా చేశారు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు