'అరవింద సమేత' ప్రీరిలీజ్: ఎన్టీఆర్ రాకతో అభిమానుల కేకలు

By Udayavani DhuliFirst Published Oct 2, 2018, 7:58 PM IST
Highlights

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ముందుగా త్రివిక్రమ్, నిర్మాత చినబాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి తారలతో పాటు చిత్రయూనిట్ మొత్తం ఈ వేడుకకు హాజరైంది.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో రూపొందుతోన్న 'అరవింద సమేత' సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ ఈరోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా నిర్వహిస్తున్నారు. ముందుగా 
త్రివిక్రమ్, నిర్మాత చినబాబు, సిరివెన్నెల సీతారామశాస్త్రి వంటి తారలతో పాటు చిత్రయూనిట్ మొత్తం ఈ వేడుకకు హాజరైంది. సిరివెన్నెల తన స్పీచ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. 

త్రివిక్రమ్ సరికొత్త బాణాన్ని ఈ సినిమాతో తెలుగు ప్రాంతాల మీద వేయబోతున్నాడని చెప్పి సినిమాపై అంచనాలను పెంచేశారు. ఎన్టీఆర్ ఈ సినిమాలో విభిన్న పాత్ర పోషించాడని చెప్పిన ఆయన సినిమా ఎలా ఉండబోతుందో తన స్టయిల్ లో చెప్పారు.

''సమాజంలో ఉన్న పరిస్థితులు.. అలజడులు, అల్లకల్లోలాలు, పగలు, కక్షలు అవి మాత్రమే కాకుండా ప్రేమలు, కులాలు కూడా చావుని గ్లామరైజ్ చేస్తున్నాయి. అలాంటి ఈ పరిస్థితుల్లో జీవితాన్ని ప్రేమతో ఎలా బతికించొచ్చనే సారాంశాన్ని ఈ సినిమాలో చూపించారు. ఆ సారాంశాన్ని చెప్పడానికి ఒక వీరుడు కావాలి. అతడే యంగ్ టైగర్'' అంటూ ఆయన స్పీచ్ ఇస్తోన్న సమయంలో ఎన్టీఆర్ తన అన్నయ్య కల్యాణ్ రామ్ తో కలిసి వేడుకకు హాజరయ్యారు. ఆయన్ని చూసిన అభిమానులు ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. ఎన్టీఆర్ రాగానే త్రివిక్రమ్ ని హత్తుకొని మిగిలిన వారిని పలకరించాడు. 

click me!