జాన్వీని ముంచినా లేపినా ఆర్ ఆర్ ఆర్ హీరోలే!

By Sambi ReddyFirst Published Mar 21, 2024, 8:18 AM IST
Highlights


రెండు భారీ ప్రాజెక్ట్స్ కి సైన్ చేసింది జాన్వీ కపూర్. ఆమె సౌత్ కెరీర్ ఈ చిత్ర విజయాలపై ఆధారపడి ఉంది. ఆర్ ఆర్ ఆర్ హీరోలైన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మీదే ఆమె ఆశలు పెట్టుకుంది. 
 

జాన్వీ కపూర్ సిల్వర్ స్క్రీన్ కి పరిచయమై ఐదేళ్లు దాటిపోయింది. అయినా ఆమెకు బ్రేక్ రాలేదు. నటిగా ఒక ఇమేజ్ తెచ్చుకోలేదు. బాలీవుడ్ స్టార్స్ సైతం జాన్వీని పట్టించుకోలేదు. ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ లేదు. అయినప్పటికీ రెండు క్రేజీ ప్రాజెక్ట్ పట్టేసింది ఆమె. దేవర, ఆర్సీ 16 చిత్రాల్లో జాన్వీ కపూర్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తున్న దేవర షూటింగ్ జరుపుకుంటుంది. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న ఆర్సీ 16 తాజాగా లాంచ్ చేశారు. 

జాన్వీ పై సౌత్ డైరెక్టర్స్ ఆసక్తి చూపడం వెనుక ప్రధాన కారణం, ఆమె శ్రీదేవి వారసురాలు కావడమే. కొన్నాళ్లుగా జాన్వీని టాలీవుడ్ కి తేవాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. దేవర మూవీతో అది సాకారం అయ్యింది. సీనియర్ ఎన్టీఆర్-శ్రీదేవిలది బ్లాక్ బస్టర్ కాంబినేషన్. పలు హిట్ చిత్రాల్లో వారు జంటగా నటించారు. ఆ లెజెండరీ నటుల వారసులు జూనియర్ ఎన్టీఆర్-జాన్వీ కలిసి నటించడం ఒక విశేషం. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

రామ్ చరణ్-జాన్వీ కాంబో కూడా అలాంటిదే. శ్రీదేవి-చిరంజీవి జంటగా నటించిన జగదేకవీరుడు అతిలోకసుందరి ఇండస్ట్రీ హిట్. ఆ చిత్రంలో చిరంజీవి-శ్రీదేవి కెమిస్ట్రీ అద్భుతం అనాలి. ఇలా జాన్వీ... తన తల్లి శ్రీదేవితో నటించిన వారసులకు జంటగా నటిస్తుంది. బాలీవుడ్ కి మించి ఎదిగిన టాలీవుడ్ లో పాగా వేస్తే జాన్వీ కెరీర్ సెట్ అయినట్లే. టాలీవుడ్ నిర్మాతలు వందల కోట్ల చిత్రాలు నిర్మిస్తున్నారు. హీరోయిన్స్ కి కూడా భారీ రెమ్యూనరేషన్స్ ఆఫర్ చేస్తున్నారు. 

దేవర, ఆర్సీ చిత్రాల్లో ఒక్కటి విజయం సాధించినా జాన్వీ పంటపండినట్లే. అదే సమయంలో ఈ క్రేజీ ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయితే జాన్వీకి సౌత్ లో డోర్లు మూసుకుపోతాయి. ముఖ్యంగా తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాకపోవచ్చు. కాబట్టి జాన్వీని ముంచినా తేల్చినా అది ఆర్ ఆర్ ఆర్ హీరోల చేతిలో ఉంది. మరి జాన్వీని కెరీర్ ని ఎన్టీఆర్, రామ్ చరణ్ ఎలా మలుపు తిప్పుతారో చూడాలి.. 

click me!