
సాహో, రాధే శ్యామ్ సినిమాలతో పాన్ ఇండియా రేంజ్లో ఇప్పటికే ప్రేక్షకులను డార్లింగ్ పలకరించిన సంగతి తెలిసిందే. ఇవి కాకుండా ప్రభాస్ మరో పాన్ ఇండియా సినిమాలతో సందడి చేయడానికి సమాయత్తమవుతున్నారు. అలా ప్రభాస్ లిస్టులో ఉన్నచిత్రాల్లో ఆది పురుష్ ఒకటి. బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ రామాయణంను ఆది పురుష్ టైటిల్ తో రూపొందించారు. మన ఇతిహాసం రామాయణం ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. ఆది పురుష్ చిత్రాన్ని త్రీడీ వెర్షన్, ఐ మాక్స్ లో రూపొందించి రిలీజ్ కు రెడీ చేస్తున్నారని ఇన్నాళ్లూ వార్తలు వచ్చాయి. అందుకు సంబంధించిన పనులు లాస్ ఏంజెల్స్లో జరిగాయి.అయితే ఇప్పుడు IMAX వెర్షన్ కాన్సిల్ అయ్యిందని అని సమాచారం.
కాన్సిల్ కావటానికి కారణం ఆ స్క్రీన్లన్నీ హాలీవుడ్ మూవీ ఫ్లాష్ కోసం ఎప్పుడో బ్లాక్ చేశారని సమాచారం. ఐమాక్స్ రూల్స్ ప్రకారం ఒకే సమయంలో రెండు సినిమాలు ఆ ఫార్మాట్ లో వేయడానికి వీలు పడదు. నిజానికి ఆదిపురుష్ ముందు అనుకున్న తేదీ 2023 సంక్రాంతి. దానికి అనుగుణంగానే అప్పటి పోస్టర్లలో ఐమాక్స్ లోగోతో పాటు ప్రమోషన్లు చేశారు కానీ ఊహించని విధంగా పోస్ట్ పోన్ కావడంతో ఐమాక్స్ స్క్రీన్లు దొరకకుండా పోయాయి. అయితే మన తెలుగుకి పెద్దగా వచ్చే నష్టం లేదు.
ఆంధ్రప్రదేశ్ లో ఒక్క ఐమాక్స్ స్క్రీన్ లేదు. తెలంగాణాలో ఒకే ఒకటి అదీ హైదరాబాద్ ప్రసాద్ లో ఉన్నది, సూళ్లూరుపేటలో యువి వాళ్ళు స్థాపించివి పెద్ద తెరలే కానీ వాటికి ఐమ్యాక్స్ ప్రొజెక్షన్ ఉండదు. బెంగళూరు, ముంబై, చెన్నై, కోచి లాంటి నగరాల్లో మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంది. అక్కడ ది ఫ్లాష్ స్క్రీనింగ్ ఉంటుంది.
ఈ చిత్రంలో ప్రభాస్ రాముడిగా నటిస్తే.. సైఫ్ ఆలీఖాన్ రావణాసురుడిగా నటించారు. కృతి సనన్ జానకి దేవి పాత్రలో నటించారు. ఆది పురుష్ కోసం ఇండియన్ సినిమాల్లో ఇప్పటి వరకు ఉపయోగించని సరికొత్త మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని ఈ సినిమా కోసం ఉపయోగిస్తున్నట్లు ఇప్పటికే చిత్ర యూనిట్ ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన సాహో, రాధే శ్యామ్ ఆశించిన స్థాయిలో విజయాలను సాధించలేదు. మరి ఈసారైనా ఆది పురుష్, సలార్ చిత్రాలతో తో ప్రభాస్ భారీ విజయాన్ని సాధించాలని ప్రభాస్ ఫాన్స్ ప్రార్థిస్తున్నారు. ఈ రోజు నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుపెట్టబోతున్నారు. రికార్డు స్థాయి ఓపెనింగ్స్ గురించి ఇప్పటికే విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.