మైత్రీలో నితిన్,ఉగాది లాంచ్, చిరు కథతోనే?

By Surya PrakashFirst Published Mar 17, 2023, 8:10 AM IST
Highlights

 నితిన్ ఈ సినిమా ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఉగాది రోజు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోంది.
 


వెంకీ కుడుముల దర్శకత్వంలో  ఆ మధ్యన మెగాస్టార్ చిరంజీవి ఒక సినిమా అనౌన్స్ చేశారు. అన్నీ బాగుండి ఉంటే ఈ సినిమాని ఆర్ఆర్ఆర్ నిర్మాత డివివి దానయ్య నిర్మించాల్సి ఉంది. కానీ ఈ సినిమా తనకు అంతగా వర్క్ అవుట్ కాకపోవచ్చు అని మెగాస్టార్ చిరంజీవి భావించి ప్రక్కన పెట్టేసారు.  ఇదే విషయాన్ని వెంకీ కుడుముల దృష్టికి తీసుకు వెళ్లడంతో కథలో ఏదైనా మార్పులు చేర్పులు చేయాలని  అడగడంతో కథలో మార్పులు చేర్పులు చేసినా అది పూర్తిస్థాయిలో కథను ఇబ్బంది పెట్టడమే తప్ప తనకు వర్కౌట్ అయ్యే అవకాశం కనిపించడం లేదని మెగాస్టార్ చెప్పి ప్రక్కన పెట్టేసారు. కథ బాగుంది కానీ తన ఇమేజ్ కి సరిపడ కథ  కాదనే  ఈ సినిమాని మెగాస్టార్ చిరంజీవి వద్దనుకున్నారు. 

ఈ క్రమంలో ఇదే కథను వెంకీ కుటుంబంలో గతంలో భీష్మ సినిమా చేసిన నితిన్ దగ్గరకు తీసుకెళ్లడంతో నితిన్ ఆ కథ విని వెంటనే సినిమా చేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుసింది.  ఈ నేపథ్యంలోనే నితిన్ ఈ సినిమా ఒప్పుకోవడం ఆసక్తికరంగా మారింది. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఉగాది రోజు అఫీషియల్ ఎనౌన్సమెంట్ రాబోతోంది.

 భీష్మ  తర్వాత వస్తోన్న సినిమా కాబట్టి.. వెంకీ  కుడుముల – నితిన్ ల కాంబినేషన్ పై మంచి అంచనాలు ఉంటాయి. పైగా  ఈ సినిమా పక్కా కమర్షియల్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్ నేపథ్యంలో రాబోతుంది. అలాగే  ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ప్లాష్ బ్యాక్  ఎనభై నాటి కాలంలో జరుగుతుందని.. నితిన్ క్యారెక్టర్ లో మూడు వేరియేషన్స్ ఉంటాయని చెప్తున్నారు.   వెంకీ కుడుముల – నితిన్ లతో  మైత్రీ మూవీ మేకర్స్  ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించబోతుంది.   
 

click me!