ఆ క్రికెటర్ నాతో సహజీవనం చేశాడు.. పవన్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

By Udayavani DhuliFirst Published Oct 17, 2018, 10:25 AM IST
Highlights

పంజాబీ ముద్దుగుమ్మ నికిషా పటేల్.. పవన్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత తమిళనాట తన అధృష్టాన్నిపరీక్షించుకుంది. అక్కడ చాలా సినిమాల్లోనే నటించింది. 

పంజాబీ ముద్దుగుమ్మ నికిషా పటేల్.. పవన్ నటించిన 'కొమరం పులి' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. ఈ సినిమా ఫ్లాప్ కావడంతో నికిషాకి తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. ఆ తరువాత తమిళనాట తన అధృష్టాన్నిపరీక్షించుకుంది. అక్కడ చాలా సినిమాల్లోనే నటించింది.

అయినా స్టార్ ఇమేజ్ ని మాత్రం దక్కించుకోలేకపోయింది. అప్పట్లో ఆమెపై రూమర్స్ బాగానే వినిపించేవి. క్రికెటర్ శ్రీశాంత్ తో ఆమె రిలేషన్ లో ఉందనే వార్తలు బలంగా వినిపించేవి. అయితే దీని గురించి శ్రీశాంత్ కానీ నికిషా కానీ ఎప్పుడూ పెదవి విప్పలేదు.

ఆ తరువాత శ్రీశాంత్.. భువనేశ్వరి అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగి చాలా కాలం అవుతోంది. అయితే ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీశాంత్ తాను భువనేశ్వరిని ఏడేళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నానని అన్నారు. ఈ వ్యాఖ్యలపై నికిషా పటేల్ మండిపడింది.

వేరే అమ్మాయిని ఏడేళ్లుగా ప్రేమిస్తే మరి నా సంగతేంటని ప్రశ్నించింది. తాను ఏడాది పాటు శ్రీశాంత్ తో సహజీవనం చేసినట్లు నికిషా బయటపెట్టింది. శ్రీశాంత్ తో బ్రేకప్ అయిన తరువాత ప్రశాంతంగా తన పని తాను చేసుకుంటున్నట్లు, అయితే శ్రీశాంత్ నిజాన్ని దాచడం తట్టుకోలేకపోతున్నానని నికిషా చెప్పుకొచ్చింది. 

click me!