
నిఖిల్ 'స్పై' #Spy అనే సినిమాతో వస్తున్న సంగతి తెలిసిందే. అయితే గత కొద్ది రోజుల నుంచీ నిఖిల్ కి, నిర్మాత కి పడటం లేదని, ఇద్దరి మధ్య చిన్న పాటి యుద్దం నడుస్తోందని వార్తలు వస్తున్నాయి. రిలీజ్ డేట్, ప్రమోషన్స్ విషయంలో హీరో నిఖిల్(Nikhil), నిర్మాత కె. రాజశేఖర్ రెడ్డి మధ్య అభిప్రాయభేదాలు నెలకొన్నట్లు చెప్తున్నారు. ఈ విభేదాల కారణంగా సినిమా ప్రమోషన్స్కు నిఖిల్ దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా ఈ సినిమాకు నిఖిల్ డబ్బింగ్ చెప్పడానికి నిరాకరించినట్లు సమాచారం. అయితే నిఖిల్ డబ్బింగ్ చెప్పకున్నా ... టెక్నాలజీ వాడి.. సినిమా పూర్తి చేసి విడుదల చేసేందుకే.. నిర్మాత సన్నాహాలు..చేస్తున్నట్లు వినపడుతోంది. అయితే అనుకోని విధంగా ఈ వార్తలు ప్రచారంలో ఉండగానే రిలీజ్ డేట్ ప్రకటించేసారు.
ఎవరూ ఊహించని విధంగా ఈ నెల 29 విడుదల కాబోతున్నట్టు యూనిట్ అధికారికంగా కొత్త పోస్టర్ తో ప్రకటించింది. డబ్బింగ్ అవ్వలేదు..షూట్ పెండింగ్ ఉంది అని వింటూండగానే ..నిర్మాత రాజశేఖర్ ఇప్పుడీ ప్రకటనతో కొత్త షాక్ ఇచ్చారు. రిలీజ్ కు ఉన్న అతి కొద్ది రోజులైన పన్నెండు రోజుల్లో పబ్లిసిటీని ఎలా చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది. మినిమం ప్రమోషన్స్ అయిన ఈవెంట్లు, ఇంటర్వ్యూలు చాలా అవసరం. కానీ అతి కొద్దిసమయంలో ఇవన్నీ ఎంత వేగంగా పూర్తి చేయగలరనేది పెద్ద టాస్కే. ఇప్పుడీ పరిణామం పట్ల నిఖిల్ ఎలా రెస్పాండ్ అవుతాడు అనేది ఆసక్తికరంగా మారింది
క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కావడం ఇష్టం లేకపోవడంతో ఈ విషయంలో నిర్మాతతో నిఖిల్ విభేదించినట్లు చెబుతోన్నారు. షూటింగ్తో పాటు ప్రమోషన్స్కు టైమ్ తీసుకుంటే బాగుంటుందని, సినిమా రిలీజ్ డేట్ను వాయిదావేయమని నిర్మాతను అతడు కోరినట్లు చెబుతోన్నారు. నిఖిల్ రిక్వెస్ట్ను ప్రొడ్యూసర్ పట్టించుకోలేదని తెలిపింది. నిఖిల్ ప్రమేయం లేకుండానే 29న సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయినట్లు తెలిసింది. ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టారు. అక్కడే వచ్చింది గొడవ అంటున్నారు.
ఈ సినిమా నేపధ్యం స్వతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ (SubhashChandrabose) చనిపోయారా, బతికున్నారా, ఉంటే ఎక్కడున్నారు, ఎలా మాయం అయ్యారు అనే ఒక మిస్టరీ కథ ఆధారంగా వస్తున్న సినిమా ఇది. స్పై సినిమాలో ఐశ్వర్య మీనన్ హీరోయిన్గా నటిస్తోండగా, ఆర్యన్ రాజేష్,సన్యా ఠాకూర్ కీలక పాత్రలను పోషిస్తోన్నారు. స్పై సినిమాతో ఎడిటర్ గ్యారీ బీ హెచ్ డైరెక్టర్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.