కొమరం పులి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నికీషా పటేల్ కు అంతగా కలసి రాలేదు. తొలి చిత్రమే తీవ్ర నిరాశకు గురిచేసింది.
కొమరం పులి చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన నికీషా పటేల్ కు అంతగా కలసి రాలేదు. తొలి చిత్రమే తీవ్ర నిరాశకు గురిచేసింది. ఆ తర్వాత నటించిన చిత్రాలు కూడా నికీషా పటేల్ కు సక్సెస్ తెచ్చిపెట్టలేదు. దీనితో నికిషా పటేల్ కు సరైన అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం నికీషా పటేల్ ఆరవ్ కు జోడిగా 'మార్కెట్ రాజా ఎంబీబీఎస్' చిత్రంలో నటిస్తోంది.
ఈ చిత్రంలో ముద్దు సన్నివేశం గురించి నికీషా పటేల్ ఓ విషయాన్ని తెలియజేసింది. తనకు లిప్ లాక్ సన్నివేశాల్లో నటించడం ఇష్టం లేకున్నా ఈ చిత్రంలో తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చిందని తెలిపింది. సినిమాలో చాలా ముఖ్యమైన సన్నివేశం. అందువల్లే ముద్దు సన్నివేశంలో తప్పనిసరి పరిస్థితుల్లో నటించాల్సి వచ్చింది. ఈ సన్నివేశం వలన ప్రేక్షకులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని తెలిపింది.
నటిగా మంచి గుర్తింపు తెచ్చుకునేందుకు తాను ప్రయత్నిస్తూనే ఉన్నానని.. ఎదో ఒకరోజు తాను అనుకున్న విధంగా నటిగా ఎదిగి తీరుతానని నికీషా చెబుతోంది.