
పేరు, డబ్బు ఎంత ఉన్నా.. చేసే పనులు గౌరవంగా ఉండాలి. అంతే కాని నలుగురు విమర్షించేలా ఉండకూడదు. అలా ఉన్నప్పుడు ఇదివరకు ఎవరు ఏం అనేవారు కాదేమో కాని.. ఇప్పుడు సోషల్ మీడియా ఊరుకోవడం లేదు. ముఖ్యంగా సినిమా వాళ్లు చేసేపొరపాట్లను ఏకిపారేస్తుంది. అది ఎంత పెద్ద స్టార్ అయినా.. తప్పుడు ఎత్తి చూపిస్తుంది సోషల్ మీడియా. దాన్ని నుంచి తప్పించుకోవడం చాలా కష్టం. అలానే సోషల్ మీడియా ట్రోల్స్ కు దొరికిపోయారు బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్.
రీసెంట్ గా ఇండియన్ టాప్ బిజినెస్ మెన్ బోనీ కపూర్..ముంబయ్ లో.. సంప్రదాయ కళలను ప్రోత్సహించడం కోసం నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ సెంటర్ ను ప్రారంభించారు. దీని కోసం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో ఓ అద్భుతమైన భవనాన్ని నిర్మించారు. ఈ బిల్డింగ్ ఓపెనింగ్ కు బాలీవుడ్, హాలీవుడ్ స్టార్స్ దిగివచ్చారు. ప్రియాంక, నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, రజనీకాంత్, బోనీ కపూర్ తదితరులతో పాటు అమెరికా మోడల్ జిగి హదిద్ కూడా ఈ ఈవెంట్ లో సందడి చేసింది.
అయితే హాలీవుడ్ మోడల్ కనిపించగానే మన స్టార్స్ ఫారుఖ్ ఖాన్, ఐశ్వర్య రాయ్, బోనీ కపూర్లు ఫోటోలు దిగారు. అయితే ఇందులో జిగీ..బోనీకపూర్ తో దిగిన ఫోటో మాత్రమే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటో చూసిన నెటిజన్లు బోనీ కపూర్ ను పిచ్చి పిచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. ఆయన పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ ఆ ఫోటోలో ఆయన ఏంచేశారంటే.. ఎందుకంటే.. ఆ ఫొటోలో బోనీ, జిగి నడుముపై చేయి వేసి.. రెండు వేళ్లు గట్టిగా నొక్కి పట్టి ఉన్నారు.
దీంతో నెటిజన్లకు చిర్రెత్తుకొచ్చింది. నీకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు కదా.. నీ కూతురు వయసున్న అమ్మాయితో ఇలానేనే ఉండేది. ఎంటా పాడు పని.. ‘‘ యువ నటులు, ఇతరులను చూసి బోనీ కపూర్ నేర్చు కోవాల్సింది చాలా ఉంది అంటున్నారు. అంతే కాదు .. మీ చేతులు కాస్త దూరంగా పెట్టుకుంటే మంచిది అని ఒకరు. మీ కూతుర్ల నడుములు కూడాఇలానే ఎవరైనా పట్టుకుంటే.. మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది అంటూ.. రకరకాల కామెంట్లు చేస్తున్నారు. దాంతో ఈ ఇష్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.