నటి మాధవీలత పోస్ట్ లపై నెటిజన్ల ఆగ్రహం!

By Udayavani DhuliFirst Published Oct 21, 2018, 7:33 PM IST
Highlights

నటి మాధవీలత సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఓ పక్క సినిమాల గురించి మరోపక్క రాజకీయాల గురించి చర్చిస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

నటి మాధవీలత సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్ లు ఈ మధ్యకాలంలో బాగా వైరల్ అయ్యాయి. ఓ పక్క సినిమాల గురించి మరోపక్క రాజకీయాల గురించి చర్చిస్తూ.. సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ లపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ ప్రజలకు చేరడం లేదని ఆమె తన అభిప్రాయాన్ని ఓ పోస్ట్ ద్వారా వ్యక్తం చేసింది.

''సీఎం రిలీఫ్ ఫండ్ అనేది మొదటి పర్సన్.. ఫండ్ వచ్చేసి ఐసుముక్క.. ప్రజలు ఏమో పదో పర్సన్.. అది చేతులు మారుతూ వచ్చేసరికి ప్రజలకి మిగిలేది నీటిచుక్క. సమస్యలకి పడింది పెద్ద బొక్క. ఇంకేంటి మిగిలేది ఐసుముక్క. మధ్యలో ఆఫీసర్స్ ఛాయిస్'' అని పెట్టిన పోస్ట్ పై నెటిజన్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మీకేం తెలుసని ఫండ్ వ్యవహారాల గురించి మాట్లాడుతున్నారంటూ ఆమెని ప్రశ్నించారు.

నెటిజన్ల విమర్శలపై స్పందించిన మాధవీలత మరో పోస్ట్ పెట్టింది. ''పొద్దున్న నేను పెట్టిన స్టేటస్ ఏంటి మీరు రాసిన కామెంట్స్ ఏంటి సీఎం ఫండ్స్ ఇస్తున్నారు ప్రజలకి ఇవ్వమని కానీ అది మధ్యలో ఉన్న దళారీ ల వాళ్ళ ప్రజలకి చేరడం లేదు అని పెట్టాను.

29 రాష్ట్రాల్లో సీఎం ఫండ్స్, పీఎం ఫండ్ ఇలానే అవుతుంది ఇంత పీత బ్రైన్స్ తో ఉన్న మీలాంటి ప్రజలంటే నాయకులూ వాడుకోవడంలో తప్పేం లేదు నాయనా మీ సావు మీరు సావండి నాకేంటి నష్టం నా జీవితం బాగుంటే చాలు ఎవడు ఎక్కడ పోతే నాకేంటి అనే ఆలోచన నాకు ఉంటే బాగుండేది తిట్టించుకునే అవసరం నాకేంటి బ్రదర్ విమెన్ కి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలీని మీరు కూడా మాట్లాడేది హా.. హా.. చెప్పండి గుండె మీద చేయేసుకుని సరిగ్గా దేశానికి సేవ చేసారా??? 

ఎపుడో చెప్పారు శ్రీ శ్రీ గారు వయసు మళ్ళిన ఎముకలు కుళ్ళిన సోమరులు మీరు ఎవరూ ఎదో చేయాలి అనే బానిస బతుకులు పీత బుర్రలు గుండె మీద చేయి వేసుకుని చెప్పండి సీఎం ప్రజలకి ఇవ్వమని ఇచ్చిన సొమ్ము ప్రజలకి చేరుతుందా??మా నక్షత్ర కొంచెం ఐన సాయం చేస్తుంది కామెంట్స్ రాసే నువ్వేం చేస్తున్నావ్ నేను ఎదో చేయలేదని నిందలు వేయడం తప్ప ఇంకేమైనా చేస్తున్నావా???'' అంటూ రాసుకొచ్చింది. దీనిపై కూడా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.  

ఇది కూడా చూడండి..

నేనిలా ఉంటే నీకేమైనా నొప్పా..? మాధవీలత ఫైర్!

ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల సీఎం అవుతారంటే చిరు అయ్యేవారు కదా..? (వీడియో)

 

click me!