రజినీకాంత్ తో వన్స్ మోర్ అంటున్న నయనతార, కాంబినేషన్ సెట్ చేస్తున్న నెల్సన్ దిలీప్..

By Mahesh JujjuriFirst Published Jan 24, 2024, 9:20 PM IST
Highlights

సూపర్ స్టార్ రజినీకాంత్ తో మరోమారు నటించడానికి రెడీ అవుతుంది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ఇప్పటికే తలైవాతో నాలుగు సార్లు నటించిన సీనియర్ బ్యూటీ.. ఐదోసారి జతకట్టడం ఖాయంగా తెలుస్తోంది. 

వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు సూపర్ స్టార్ రజినీకాంత్. ఏడుపదుల వయస్సులో కూడా కుర్రహీరోలు భయపడేలా ఎనర్జీతో ఉరుకులు పెడుతున్నాడు. ఇక వరుస ఫెయిల్యూర్స్ వచ్చిన టైమ్ లో కూడా ఏమాత్రం తగ్గకుండా సినిమాలు చేస్తూ వెళ్ళిన రజినీకాంత్.. జైలర్ సినిమా హిట్ తో చాలామందికి సమాధానం చెప్పాడు. జైలర్ జోష్ తో వరుసగా సినిమాలు లైన్ లో పెట్టాడు తలైవా. ఇక తమిళ యంగ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్' సినిమాను రూపొందించాడు. లాస్ట్ ఇయర్  ఆగస్టు 10వ తేదీన విడుదలైన ఈ సినిమా... భారీ వసూళ్లను సాధించడంతో పాటు రిలీజ్ అయిన ప్రతీ భాషలో సూపర్ సక్సెస్ సాధించింది. 

ఇక రజినీకాంత్ చేతిలో ఇప్పటికే రెండు మూడు సినిమాలు ఉండగా.. ఇప్పుడు జైలర్ సీక్వెల్ కూడా వచ్చి చేరినట్టు తెలుస్తోంది.  ఈ సినిమా సీక్వెల్ కి రజనీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని వార్త వైరల్ అవుతోంది. జైలర్ కు సీక్వెల్ చేయాలి అని అప్పుడే అనుకున్నారట. కాని అది రూమర్ గానే మిగిలిపోయింది. కాని జైలర్ 2 కు సబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం సీనియర్ హీరోలందరికి ఉన్న సమస్యే సూపర్ స్టార్ రజినీకాంత్ కు కూడా.. ఆయన కు హీరోయిన్లు దొరకడం లేదు. జైలర్ సినిమాలో కాస్త ఓల్డ్ క్యారెక్టర్ కాబట్టి..  రమ్యకృష్ణ ఆయన భార్యగా.. ముఖ్యమైన పాత్రను పోషించింది. 

Latest Videos

ఈ సినిమా సీక్వెల్ కి సంబంధించిన కథను రజనీకి వినిపించి నెల్సన్ ఓకే చెప్పించుకున్నాడనే వార్త కొన్ని రోజుల క్రితమే షికారు చేసింది. ఇప్పుడు ఈ సినిమా కోసం హీరోయిన్ గా  నయనతార పేరు తెరపైకి వచ్చింది. ఈ సినిమాలోని ఒక కీలకమైన పాత్ర కోసం నయనతారను అప్రోచ్ అయ్యారట టీమ్. ఆమె కూడా ఈసినిమాలో నటించడానికి ఒకే చెప్పిందనే చెపుతున్నారు.  ఈ ఇద్దరు స్టార్ల  కాంబినేషన్లో  ఆల్రెడీ నాలుగు సినిమాలు వచ్చాయి. చంద్రముఖి, కథానాయకుడు, అన్నాత్తే, దర్భార్   సినిమాల్లో వీరు కలిసి నటించారు. ఇక ఈమూవీ చేస్తే.. వీరి కాంబోలో ఐదో సినిమా అవుతుంది. 
 

click me!