ఆస్కార్‌ బరిలో నయనతార, విఘ్నేష్‌ల సినిమా.. గులకరాయా మజాకా

Published : Oct 24, 2021, 09:44 AM IST
ఆస్కార్‌ బరిలో నయనతార, విఘ్నేష్‌ల సినిమా.. గులకరాయా మజాకా

సారాంశం

నయనతార, విఘ్నేష్‌ శివన్‌ కలిసి నిర్మించిన `కూజాంగల్‌‌` చిత్రం ఆస్కార్‌ బరిలో నిలిచింది. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై నయనతార, దర్శకుడు విఘ్నేష్‌ శివన్‌ సంయుక్తంగా నిర్మించారు. 

నయనతార(Nayanathara), విఘ్నేష్‌ శివన్‌(Vignesh Shivan)లు హాట్‌ లవ్‌ కపుల్‌గా సౌత్‌లో పాపులర్‌ అయ్యారు. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలతో హాట్‌ టాపిక్‌గా మారుతున్నారు. అయితే ఈ జోడి ఇప్పుడు ఇండియా వైడ్‌గా వార్తల్లో నిలవబోతున్నారు. అందుకు కారణంగా వీరిద్దరు కలిసి నిర్మించిన `కూజాంగల్‌‌`(koozhangal) చిత్రం ఆస్కార్‌ బరిలో నిలవడం. పీఎస్‌ వినోద్‌రాజ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ పతాకంపై Nayanathara, దర్శకుడు Vignesh Shivan సంయుక్తంగా నిర్మించారు. 

ప్రస్తుతం ఈ సినిమా ఇండియా నుంచి oscar Nominationకి వెళ్లేందుకు ఎంపికైంది. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 15 మంది సభ్యుల జ్యూరీ మన దేశం నుంచి ఆస్కార్‌ నామినేషన్‌కి వెళ్లేందుకు 14 సినిమాలను వీక్షించగా, అందులో నయన్  నిర్మించిన `కూజాంగల్‌` చిత్రాన్ని ఏకగ్రీవంగా ఎంపిక చేశారట. ఈ విషయాన్ని విఘ్నేష్‌ వెల్లడించారు. `అండ్‌ ది ఆస్కార్స్ గోస్‌ టూ.. అనే పదం వినేందుకు మరో రెండు అడుగుల దూరంలో ఉన్నాం` అంటూ తన సంతోషాన్నిపంచుకున్నాడు విఘ్నేష్‌. ఇక వచ్చే ఏడాది 94వ ఆస్కార్‌ వేడుక మార్చి నెలలో అమెరికాలోని లాస్‌ ఏంజెల్స్ లో జరగబోతుంది.

`కూళాంగల్‌` చిత కథ విషయానికి వస్తే.. `కూజాంగల్‌`  అంటే గులకరాయి అని అర్థం. భర్త పచ్చి తాగుబోతు. అతన్ని మార్చాలనుకుంటుంది భార్య. తన వల్ల కాక ఇంటి నుంచి వెళ్లిపోతుంది. అప్పుడు భార్య విలువ తెలుసుకుని ఆమెను ఇంటికి రప్పించడానికి తన కొడుకుతో కలసి ఆ భర్త ప్రయత్నాలు మొదలుపెడతాడు. భార్యను వెనక్కి తెచ్చుకోవడానికి అతనేం చేశాడనేది కథ. పీఎస్‌ వినోద్‌ రాజ్‌ తన కుటుంబంలో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా ఈ సినిమా తీశారు. దర్శకుడిగా తొలి చిత్రమే అయినప్పటికీ ప్రేక్షకులను హత్తుకునేలా తీశారు‌. 

aslo read; క్లీవేజ్‌ అందాలతో రీతూ వర్మ సంచలనం.. బ్లౌజ్‌ వేసుకోవడం మర్చిపోయావా అంటూ నెటిజన్ల కామెంట్‌.. పూజా హెగ్డేకే షాక్

నటించిన అందరూ కొత్తవారే. కానీ పాత్రల్లో జీవించారు. `ఇంటర్నేషనల్‌ ఫిలిం ఫెస్టివల్‌ రోటర్‌డామ్‌` (ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌)లో ప్రదర్శించబడి `కూజాంగల్‌`  ప్రతిష్టాత్మక టైగర్‌ అవార్డు దక్కించుకుంది. 50 ఏళ్ల ఐఎఫ్‌ఎఫ్‌ఆర్‌ చరిత్రలో 2017లో మన దేశానికి తొలి అవార్డును తెచ్చిన మలయాళ `దుర్గా` తర్వాత ఈ అవార్డు దక్కించుకున్న మరో సినిమా `కూజాంగల్‌`  కావడం విశేషం. ఇప్పుడు ఆస్కార్‌ బరిలో నిలిచిన ఈ గులకరాయి శబ్దం ఆస్కార్ లో వినిపిస్తుందా? అన్నది చూడాలి. 

also read: నయనతార, విఘ్నేష్‌ శివన్‌ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్?
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Articles on
click me!

Recommended Stories

Akhanda 2 Review: 'అఖండ 2' మూవీ రివ్యూ, రేటింగ్.. బాలకృష్ణ తాండవం ఎలా ఉందో తెలుసా ?
సపోర్ట్ చేసినందుకు వెన్నుపోటు పొడిచిన కళ్యాణ్, మనస్తాపానికి గురైన భరణి.. తనూజ ఏడుపు ఫేక్ అంటూ ముఖం మీదే