
టాలీవుడ్ లో రాబోతున్న మరో ఇంట్రెస్టింగ్ మూవీ యాత్ర. వైఎస్.రాజశేఖర్ రెడ్డి జీవిత ఆధారంగా యాత్ర కాన్సెప్ట్ తో రాబోతున్న ఈ సినిమాపై ఓ వర్గం ప్రేక్షకుల్లో అంచనాలు భారీగానే ఉన్నాయి. సినిమా ప్రమోషన్స్ మొన్నటివరకు బాగానే ఉన్న ఇప్పుడు పెద్దగా బజ్ క్రియేట్ చేయడం లేదు.
దర్శకుడు మహి వి రాఘవ ఈ సినిమా అనంతరం ఒక మల్టీస్టారర్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. కోలీవుడ్ హీరో విశాల్ - టాలీవుడ్ హీరో నానిలతో కలిసి ఈ కుర్ర దర్శకుడు ఇటీవల మంచి ఒక కాన్సెప్ట్ వినిపించాడు. స్క్రిప్ట్ పై ఇద్దరు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. అయితే మహి వి రాఘవకు ఇంకా ఫైనల్ సిగ్నల్ ఇవ్వలేదని తెలుస్తోంది.
కథ బాగానే ఉన్నప్పటికీ డైరెక్టర్ టేకింగ్ విషయంలో విశాల్ కాస్త డౌట్ గా ఉన్నాడంటూ కోలీవుడ్ లో టాక్ వచ్చింది. ఇప్పుడు మహి వి రాఘవ యాత్ర సినిమాపై ఇద్దరు హీరోలు ఓ కన్నేసి ఉంచారు. ఈ సినిమా హిట్టయితే నాని విశాల్ కథకు ఫుల్ గా గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని అనుకుంటున్నారు. యాత్ర సినిమా ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మమ్ముంటి వైఎస్ పాత్రలో నటించిన ఈ సినిమా ఎంతవరకు హిట్టవుతుందో చూడాలి మరి.