నాని నుంచి మరో సినిమా అధికారిక ప్రకటన వచ్చింది. నెక్ట్స్ `నాని 32` సుజీత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. ఈ మూవీ ప్రకటనకు సంబంధించిన గ్లింప్స్ ఎగ్జైటింగ్గా ఉంది.
`దసరా` సినిమా తర్వాత నాని గేమ్ పూర్తిగా మారిపోయింది. ఇమేజ్ పరంగా, మార్కెట్ పరంగా, ఆయన ఎంచుకునే సినిమా కథ పరంగా నెక్ట్స్ లెవల్ చూపిస్తున్నాడు. గతేడాది `హాయ్ నాన్న`తో అదరొట్టాడు. త్వరలో `సరిపోదా శనివారం` చిత్రంతో రాబోతున్నాడు. ఈ మూవీ టీజర్ ఆకట్టుకుంది. ఆసక్తిని పెంచింది. ఇందులో నాని చాలా పవర్ఫుల్గా కనిపించాడు. ఇప్పుడు మరో మూవీని ప్రకటించారు. తన పుట్టిన రోజుని పురస్కరించుకుని సుజీత్తో చేయబోతున్న సినిమాని ప్రకటించారు. డీవీవీ దానయ్య బ్యానర్లో ఈ మూవీ తెరకెక్కబోతుంది.
ఇక ఈ రోజు సాయంత్రమే రావాల్సిన `నాని 32` మూవీ అనౌన్స్ మెంట్ కాస్త ఆలస్యంగా వచ్చింది. ఇందులో సినిమా ఏంటో చెప్పే ప్రయత్నం చేశారు. వాయిలెంట్ని తగ్గించి సంగీతానికి ప్రయారిటీ ఇవ్వాలని ఈ సినిమా ప్రకటన ప్రారంభమైంది. కొందరు విలన్లు పరిగెడుతుంటాడు. వారిని ఓ వ్యక్తి చితకొట్టి పడేస్తాడు. ఆ తర్వాత అతని లైఫ్ ఎలాంటి మలుపు తిరిగిందనేలా ఇందులో చూపించారు. అంతేకాదు హింసాత్మకమైన వ్యక్తి అహింసాత్మకంగా మారితే, అతని జీవితం ఎలా తలక్రిందులు అయ్యింది అనేది ఇందులో చెప్పారు. చమత్కారమైన యాక్షన్ రైడ్గా మూవీ సాగుతుందని తెలిపారు.
ప్రకటకి సంబంధించిన విడుదల చేసిన గ్లింప్స్ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇందులో నాని చాలా పవర్ ఫుల్గా పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన హింసని ఎందుకు వీడాడు, ఆ తర్వాత అతని లైఫ్ ఎలా మారిందనేది ఇందులో చూపించబోతున్నట్టు తెలుస్తుంది. `ఓజీ`లాగే ఇందులోనూ గన్, బుల్లెట్లని హైలైట్గా చూపించాడు దర్శకుడు సుజీత్. వచ్చే ఏడాది ఈ మూవీని విడుదల చేయబోతున్నట్టు తెలిపారు. ఈ మూవీని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్యతోపాటు ఆయన కుమారుడు కళ్యాణ్ దాసరి కూడా నిర్మాణంలో భాగమవుతున్నారు. అంతేకాదు నాని నటిస్తున్న `సరిపోదా శనివారం`, `నాని, సుజీత్` మూవీ కూడా ఇదే బ్యానర్ లో తెరకెక్కుతుండటం విశేషం.
ఈ మూవీని ప్రకటిస్తూ నాని పోస్ట్ చేశారు. ఇది సుజీత్ మూవీ. పవన్ తర్వాత లవర్ అని పేర్కొన్నారు. పవర్ స్టార్ మూవీ తర్వాత ఇది ప్రారంభం కాబోతుందని తెలిపారు. సుజీత్.. ప్రస్తుతం పవన్ కళ్యాన్తో `ఓజీ` మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత నాని మూవీని తెరకెక్కిస్తారని తెలుస్తుంది. ఇక ఈ మూవీకి సంబంధించిన మరిన్ని విషయాలు మున్ముందు తెలియనున్నాయి.