మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం.
మహేష్ బాబు, దర్శకుడు మెహర్ రమేష్ ల మధ్య మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. మహేష్ కెరీర్ ప్రారంభం రోజులు నుంచి అంటే బాబి సినిమా నాటి నుంచి మెహర్ రమేష్ పరిచయం. ముఖ్యంగా మెహర్ రమేష్ ..మహేష్ ఫ్యామిలీతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. ఈ నేఫధ్యంలో రీసెంట్ గా మహేష్ తో ఓ ఈవెంట్ ప్లానింగ్ కు అవకాసం ఇచ్చింది ఆ కుటుంబం.
అయితే ఆ పోగ్రాం చివరి నిముషంలో కాన్సిల్ అయ్యింది. అందుకు కారణం మెహర్ రమేష్ పూర్ ప్లానింగ్ అని తెలుస్తోంది. టిక్కెట్లు అమ్ముడు పోకపోవటం వల్ల పోగ్రాం ఆగిపోయిందని తెలిసి మహేష్ ఫ్యాన్స్ చాలా నిరాశపడ్డారు. మిగతా హీరోల అభిమానులు ఈ విషయం అడ్డం పెట్టి మహేష్ ఫ్యాన్స్ ని ట్రోల్ చేయటం మొదలెట్టారు. అసలేం జరిగిందీ అంటే..
ఏన్ ఈవెనింగ్ విత్ సూపర్స్టార్ మహేష్బాబు అనే పేరుతో మహేష్బాబుని న్యూయార్క్ లో కలుసుకునే అవకాశాన్ని కల్పిస్తామంటూ రిత్విక్ క్రియేషన్స్ సంస్థ ఒక కార్యక్రమాన్ని ప్లాన్ చేసింది. అక్టోబర్ 27న ఈ ఫండ్ రైజింగ్ ఈవెంట్ నిర్వహిస్తామని గత రెండు నెలలుగా చాలా పబ్లిసిటీ చేశారు. టికెట్ సేల్స్ కూడా మొదలెట్టారు. కానీ లాస్ట్ మినిట్ లో సమయం దగ్గరపడ్డాక, పోగ్రాం క్యాన్సిల్ చేశారు.
వేదిక, సెక్యురిటీ అంశాల కారణంగా అక్టోబర్ 27న నిర్వహించాలనుకున్న ఈవెంట్ని వేరే తేదీకి వాయిదా వేస్తున్నాం. టికెట్లు కొన్న వారికి తిరిగి డబ్బు చెల్లిస్తామని రిత్విక్ క్రియేషన్స్ సంస్థ ప్రెస్నోట్ పంపింది.
అయితే ఇలా పోగ్రాం అర్దాంతరంగా ఆగిపోవటానికి కారణం మెహర్ రమేష్ ఆయన టీమ్ ప్రోపర్ ప్లానింగ్ లేకపోవటం, టిక్కెట్ రేట్లు ఎక్కువపెట్టడం అని చెప్తున్నారు. మొదట ఈ ఈవెంట్ ని ప్రొఫెషనల్ ఈవెంట్ మేనేజర్స్ కు అప్పచెప్దామనుకున్నారు. అయితే మెహర్ రమేష్ వెళ్లి నమ్రత ని కలిసి ఈవెంట్ ని పెద్ద సక్సెస్ చేస్తామని ప్రామిస్ చేసి తనకు ఇమ్మని అడగటం జరిగింది.
వారిని నమ్మిన నమ్రత..మా వాళ్లు చెప్తున్నా వినకుండా మెహర్ రమేష్ అండ్ టీమ్ కు అప్పచెప్పింది. ఈ సంఘటనతో మెహర్ రమేష్ పై నమ్రత చాలా సీరియస్ అయ్యిందని, మహేష్ బాబు రెప్యుటేషన్ పై ఈ ఇంపాక్ట్ పడుతుందని అప్ సెట్ అయ్యారని తెలుస్తోంది. మహేష్బాబు ప్రస్తుతం అమెరికాలో మహర్షి సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు. నెల రోజుల పాటు షూటింగ్ అక్కడే ఉండనున్నారు.
ఇది కూడా చదవండి..
మహేష్ పరువు తీయటం కాకపోతే ఎందుకీ పనులు?