బిగ్ బాస్ తెలుగు 7 హౌజ్లో లేడీ కంటెస్టెంట్లలో స్ట్రాంగ్ కంటెస్టెంట్గా నిలిచింది ప్రియాంక జైన్, శోభా శెట్టి. ఈ ఇద్దరు అనేక అడ్డంకులను ఎదుర్కొని ఇక్కడి వరకు వచ్చారు. అయితే హౌజ్లో సీరియల్ బ్యాచ్ గా పేరు తెచ్చుకున్నారు ప్రియాంక, శోభా శెట్టి, అమర్ దీప్. ఈ ముగ్గురు మొదట్నుంచి కలిసే గేమ్ ఆడుతున్నారు. టాస్క్ ల్లోనూ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఏ అవసరం వచ్చినా ఈ ముగ్గురు ఒకరికొకరు అండగా ఉంటారు. వారిలో ఒకరిని గెలిపించుకునేందుకు ప్రయత్నిస్తారు.
కానీ ఇతరుల విషయంలో మాత్రం చాలా సార్లు కంప్లెయింట్స్ చేస్తుంటారు. ముఖ్యంగా శివాజీపై ప్రారంభం నుంచి కంప్లెయింట్స్ చేసేవారు. పల్లవి ప్రశాంత్, యావర్లను కూడా టార్గెట్ చేశారు. అంతకు ముందు భోలే షావలి విషయంలోనూ విరుచుకుపడ్డారు. దీంతో అప్పట్నుంచే వీరి గేమ్ స్ట్రాటజీ తెలిసిపోయింది. ఈ ముగ్గురు సేఫ్ గేమ్ ఆడుతున్నారని అర్థమైంది. అయితే నామినేషన్లోనూ వీరు తమని ఎప్పుడూ నామినేట్ చేసుకునే వారు కాదు, ఒకటి రెండు సార్లు మాత్రమే, అది కూడా చాలా అరుదు సందర్భాల్లో తప్ప.
ఇదిలా ఉంటే బిగ్ బాస్ షో చివరి దశకు చేరుకుంది. మరో మూడు వారాల్లో షో మొత్తం ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికీ అదే స్ట్రాటజీలు, అదే సేఫ్ గేమ్లు, అదే డ్రామాలు ఆడుతున్నారని బట్టబయలైంది. తాజాగా హోస్ట్ నాగార్జుననే ఆ విషయాన్ని బయటపెట్టారు. తాజాగా విడుదలైన ప్రోమోల్లో ఆ విషయం స్పష్టమవుతుంది. ఇందులో ప్రియాంక గేమ్ నుంచి తప్పుకోవాల్సి రావడంతో తన పాయింట్లని గౌతమ్కి ఇచ్చింది. ఆ తర్వాత ఆయన తప్పుకోవాల్సి రావడంతో అమర్ దీప్కి ఇవ్వమని గౌతమ్ని అడిగింది.
ఇక్కడే నాగ్కి మండింది. తన పాయింట్లు ఎవరికి ఇవ్వాలనేది అతని సొంత నిర్ణయం. కానీ ప్రియాంక చెప్పడమేంటి? అంటూ నిలదీశాడు. అర్జున్ అన్న కంటే ప్రియాంక చెల్లి ఎక్కువైపోయిందా? ఇదేం సేఫ్ గేమ్, ఇదేం గ్రూమ్ గేమ్ అంటూ ప్రశ్నించాడు నాగ్. అలాగే గౌతమ్ తన పాయింట్లు ఎవరికి ఇవ్వాలనేది అతని వ్యక్తిగత ఆట. నువ్వేందుకు ఆయనకు చెప్పావు, ఆయనతో మాట్లాడావు అని నిలదీశాడు నాగ్. దానికి ప్రియాంక దగ్గర ఆన్సర్ లేదు. నువ్వు నీ ఇండివిడ్చ్వల్ గేమ్ ఆడు అంటూ నాగ్ చెప్పగా, తాను అలానే ఆడుతున్నానని ప్రియాంక చెప్పింది.
ఏవిధంగా నీ సొంత గేమ్ ఆడుతున్నావని నాగ్ ప్రశ్నించాడు. గౌతమ్ని నువ్వు అడగడం వ్యక్తిగత గేమా?, లేక వ్యక్తిగత గేమ్ అంటే ఈ ముగ్గురా? అని ఆమె డ్రామాలు బయటపెట్టాడు నాగ్. దీనికి లేదు సర్ అంటూనే సమాధానం చెప్పలేకపోయింది ప్రియాంక. ఈ సందర్భంగానే ఆ ఇద్దరికి సపోర్ట్ చేస్తున్నారని శివాజీపై కంప్లెయింట్స్ చేసుకుంటూ వచ్చారు. మరి ప్రియాంక చేసినప్పుడు ఆ విషయం గుర్తు రాలేదా? ప్రియాంకని ఎందుకు అడగలేదంటూ గౌతమ్ని నిలదీశాడు నాగ్.
మరో ప్రోమోలో ఆమె ఈ వారం ఆడిన గేమ్ గురించి చెబుతూ బాస్కెట్లో బాల్ వేసే గేమ్లో ఎందుకు ఓడిపోయావని అనుకుంటున్నావ్ అని నాగార్జున ప్రశ్నించగా, సంచాలకులు పెట్టిన రూల్స్ వల్ల ఓడిపోయినట్టు చెప్పింది ప్రియాంక. తన పాయింట్లు గౌతమ్ కి ఇవ్వడం గ్రాటిట్యూడ్ అని చెప్పింది. మొత్తంగా ఇందులో ప్రియాంక రియాలిటీని బయటపెట్టాడు నాగ్. ఇలా అందరి గురించి వాస్తవాలను వెల్లడించే ప్రయత్నం చేశాడు నాగార్జున. నాగార్జున ఇచ్చిన స్కోర్లో శోభా శెట్టి కింద నుంచి మొదటి స్థానంలో ఉండగా ఆ తర్వాత శివాజీ, మూడో స్థానంలో ప్రియాంక నిలిచింది.