
బడా హీరోలతో వచ్చే తంటా ఇదే. హీరోలు పరస్పరం నువ్వా నేనా అంటూ బాక్సాఫీస్ ముందు తలపడటం.. వాళ్ల అభిమానులు పరస్పరం విమర్శించుకోవడం... అది చాలదన్నట్టు ఏవో ఈగోలు పెట్టుకుని.. నేరుగా వైరం పెట్టుకుని కావాల్సినంత రచ్చ చేస్తుంటారు. అయితే విబేధాలు సమసిపోగానే అదేదో మీడియా తప్పన్నట్లు మీడియా మీద విరుచుకుపడతారు. గతంలో ఇలాంటి అనుభవాలు చాలానే ఉన్నాయి. అక్కినేని నాగార్జున-నందమూరి బాలకృష్ణల మధ్య వివాదానికి సంబంధించిన ముగింపు కూడా ఇలాగే ఉంది మరి.
గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరూ పరస్పరం ఎంత దూరం పాటిస్తున్నారో అందరికీ తెలుసు. కానీ ఇప్పుడేమో తమ మధ్య ఏమీ లేదని.. అంతా మీడియానే క్రియేట్ చేసిందని కామెంట్లు చేసేశాడు నాగ్. ఒకప్పుడు తమ తండ్రుల స్నేహం తాలూకు వారసత్వాన్ని కొనసాగిస్తూ అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్న నాగ్-బాలయ్యల మధ్య ఎక్కడ తేడా కొట్టిందో ఏమో కానీ.. గత కొన్నేళ్లుగా ఇద్దరూ ఎడమొహం పెడమొహంగానే ఉంటూ వచ్చారు. ఆ మధ్య సోషల్ సర్వీస్ కోసం టాలీవుడ్ లో జరిగిన ‘మేము సైతం’ వేడుకలో కూడా అంటీ ముట్టనట్లుగానే వ్యవహరించారు. చివరికి తండ్రి తర్వాత తండ్రిలా భావించే ఏఎన్నార్ చనిపోతే కడసారి చూపు చూడటానికి కూడా బాలయ్య అందుబాట్లో ఉన్నా రాలేదు. దీన్ని బట్టి నాగార్జునతో బాలయ్యకు ఏ స్థాయిలో విభేదాలు తలెత్తాయో అర్థం చేసుకోవచ్చు.
ఏఎన్నార్ చనిపోయినపుడు బాలయ్య రాకపోవడంపై మీడియాలో ఎన్నో కథనాలు వచ్చినా దాని గురించి బాలయ్య కానీ.. నాగ్ కానీ స్పందించింది లేదు. కానీ ఈ మధ్య.. ఇద్దరి మధ్య దూరం తగ్గిందని స్నపష్ట్లుంటమవుతోంది. ఇటీవలే టీఎస్సార్ అవార్డుల వేడుక జరిగింది. ఆ వేడుకకి ఇద్దరూ హాజరయ్యారు. అంతే.. సింపుల్గా మీడియా మీద నింద వేసేసి ఇద్దరి మధ్య అసలేమాత్రం విభేదాలు లేవన్నట్లు షో చేసేశారు. మరి గొడవలేమీ లేనపుడు ఏఎన్నార్ కడసారి చూపుకు బాలయ్య ఎందుకు రాలేదో... ఏమోలేండి... కూరిమిగల దినములు మళ్లీ వచ్చెెనని సంతసించక మనకెందుకండీ...