సినీ కార్మికులను ఆదుకునేందుకు మోహన్‌లాల్‌, మమ్ముట్టి.. 145మంది స్టార్స్ తో సినిమా..

Published : Feb 07, 2021, 09:14 PM ISTUpdated : Feb 07, 2021, 09:18 PM IST
సినీ కార్మికులను ఆదుకునేందుకు మోహన్‌లాల్‌, మమ్ముట్టి.. 145మంది స్టార్స్ తో సినిమా..

సారాంశం

మలయాళ చిత్ర పరిశ్రమ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికులను ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 145 మంది తారలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌, నివిన్‌ పౌలీ ఇలా స్టార్స్ అంతా కలిసి సినిమా చేయాలని నిర్ణయించారు. 

మలయాళ చిత్ర పరిశ్రమ ఓ షాకింగ్‌ నిర్ణయం తీసుకుంది. సినీ కార్మికులను ఆదుకునేందుకు సంచలన నిర్ణయం తీసుకుంది. ఏకంగా 145 మంది తారలు కలిసి ఓ సినిమా చేయబోతున్నారు. మమ్ముట్టి, మోహన్‌లాల్‌, పృథ్వీరాజ్‌, దుల్కర్‌ సల్మాన్‌, నివిన్‌ పౌలీ ఇలా స్టార్స్ అంతా కలిసి సినిమా చేయాలని నిర్ణయించారు. దీనికి ప్రియదర్శన్‌ దర్శకత్వం వహించగా, రాజీవ్‌ కుమార్‌ ఆశీర్వాద్‌ సినిమా పతాకంపై నిర్మించనున్నారు. క్రైమ్‌ థ్రిల్లర్‌గా దీన్ని తెరకెక్కించనున్నారు. 2020 కరోనా కల్లోలం ప్రధానంగా ఈ సిసాగుతుందని తెలుస్తుంది. 

ఈ విషయాన్ని శనివారం వెల్లడించారు. మలయాళ మూవీ ఆర్టిస్టు అసోసియేషన్‌(అమ్మా) కొత్త భవనం నిర్మాణం ప్రారంభోత్సవం సందర్భంగా మోహన్‌లాల్‌, మమ్ముట్టి వెల్లడించారు. దాదాపు 10కోట్లతో కొచ్చిలో `అమ్మ` కొత్త భవనాన్ని నిర్మిస్తున్నారు. దీనికి తారలు, ఇతర ప్రముఖులు విరాళాలు అందించారని తెలుస్తుంది. ఈ కార్యక్రమంలో మోహన్‌లాల్‌, మమ్ముట్టి పాల్గొని మాట్లాడారు. సినీ కార్మికులను ఆదుకోవాలని నిర్ణయించినట్టు వెల్లడించారు. అందుకు సినిమా చేయబోతున్నట్టు చెప్పారు. 

కరోనా వల్ల షూటింగ్‌ లు లేక వేలాది మంది సినీ కార్మికులు రోడ్డున పడ్డారు, అలాగే కళాకారులు సైతం ఇబ్బంది పడ్డారు. వారిని ఆదుకునేందుకు సినిమా తీస్తున్నట్టు చెప్పారు. ఈ సినిమా తీయగా, వచ్చిన కలెక్షన్లని `అమ్మా`కి, సినీ కార్మికులకు సహాయంగా అందిస్తామని `అమ్మా` అధ్యక్షుడు మోహన్‌లాల్‌ చెప్పారు. 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

8 సినిమాలు చేస్తే 6 ఫ్లాపులు, స్టార్ హీరోయిన్ గా ఉండాల్సిన నటి ఇలా.. తనని టార్గెట్ చేయడంపై ఎమోషనల్
Jr NTR: చిరంజీవి తర్వాత ఎన్టీఆర్ ని టార్గెట్ చేశారా ?..సంచలన నిర్ణయం, తారక్ పేరుతో ఎవరైనా అలా చేస్తే చుక్కలే