
టాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram). షార్ట్ ఫిల్మ్స్ తీస్తూ మంచి గుర్తింపు పొందిన ఈయన.. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ హీరోగా ఎదుగాడు. ఇప్పటికే ‘ఎస్ఆర్ కళ్యాణమండపం’తో మంచి సక్సెస్ ను అందుకున్న కిరణ్.. మంచి బ్రేక్ కోసం ఎదురుచూస్తున్నాడు. చివరిగా ‘సెబాస్టియన్ పీసీ 524’తో ప్రేక్షకులను అలరించాడు. ఈ చిత్రం ప్రేక్షకులను అంతగా అలరించకపోవడంతో తన నెక్ట్స్ మూవీపై ఫోకస్ పెట్టాడు కిరణ్. ఈ సందర్భంగా కిరణ్, హీరోయిన్ చాందిని నటించిన తాజా చిత్రం ‘సమ్మతమే’. ఈ చిత్రం ప్రస్తుతం రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
రిలీజ్ కు సమయం దగ్గరపడుతున్న క్రమంలో చిత్ర యూనిట్ ప్రచార కార్యక్రమాలను జోరుగా నిర్వహిస్తున్నారు. ఇఫ్పటికే ఈ చిత్రం నుంచి రిలీజ్ అయిన టీజర్, సాంగ్స్, పోస్టర్స్ కు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. మరోవైపు మేకర్స్ క్రేజీ అప్డేట్స్ ను అందిస్తూ సినిమాపై ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తున్నారు. తాజాగా బిగ్ అనౌన్స్ మెంట్ చేవారు. Sammathame చిత్రం ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ ను ఈరోజు సాయంత్రం 4:05కి నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ అండ్ మున్సిపాలిటీ శాఖ మంత్రి కల్వకుంట తారాక రామారావు (KTR) హాజరు కానున్నారు. ఇదే విషయాన్ని మేకర్స్ అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
చిత్రం జూన్ 24న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. అయితే ప్రముఖ నిర్మాత, గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఈ సినిమాకు పూర్తి మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ఆధ్వర్యంలో సమ్మతమే చిత్రాన్ని వరల్డ్ వైడ్ రిలీజ్ చేయనున్నారు. దీంతో సినిమాపై మరింతగా అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాతో మరోసారి కిరణ్ అబ్బవరం హిట్ కొట్టనున్నట్టు అర్థమవుతోంది హీరోయిన్ గా ‘కలర్ ఫొటో’ ఫేమ్ చాందిని (Chandini) నటిస్తోంది. వీరిద్దరూ క్రిష్ణ, సాన్వి అనే ప్రేమికుల పాత్రలో నటిస్తున్నారు. యూజీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.