సెల్ఫీ అడిగిన మహిళతో పుషప్‌లు చేయించిన మిలింద్‌.. చివరికి విమర్శలపాలు..

By Aithagoni RajuFirst Published May 30, 2021, 8:16 AM IST
Highlights

ఓ మహిళ చేత రోడ్డుపై పుషప్‌లు చేయించాడు మోడల్‌, బాలీవుడ్‌ నటుడు మిలింద్‌. దీంతో చివరికి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది.

తనతో ఓ సెల్ఫీ దిగాలని ఆశపడిన ఓ మహిళ చేత రోడ్డుపై పుషప్‌లు చేయించాడు మోడల్‌, బాలీవుడ్‌ నటుడు మిలింద్‌. దీంతో చివరికి ఆయన తీవ్ర విమర్శలు ఎదుర్కోవల్సి వచ్చింది. తాజాగా ఈ వీడియో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళ్లితే, మిలింద్‌ ఇటీవల ఓ పాత వీడియోని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. ఇందులో ఆయన తనతో ఓ సెల్ఫీ దిగాలని ఉందని అడిగిన మహిళను 10 పుషప్‌లు చేయమని చెప్పడంతో ఆమె వెంటనే పుషప్‌లు చేసింది. ఈ విషయాన్ని స్వయంగా మిలింద్ తన సోషల్ మీడియాలో వెల్లడించారు. రాయ్‌పూర్‌లోని ఓ ప్లేస్ లో సెల్ఫీ అడిగిన ఆమెను ఇలా చేయించానని చెప్పుకొచ్చాడు. తర్వాత సోమన్ ఆ మహిళతో సెల్ఫీ దిగారు.
 
అయితే ఆమె చీర ధరించి ఉంది. పైగా ఆమెని రోడ్డుపైనే అందరు చూస్తుండగానే పుషప్‌లు చేయించాడు. దీంతో నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. ఫిట్‌నెస్ కోసం పుషప్‌లు చేయడం ఖచ్చితంగా మంచిదే, కానీ మీరు మీతో సెల్ఫీ తీసుకోవటానికి ఇలా ఒక స్త్రీని రోడ్డు మీద పుషప్‌లు చేయించడం ఏమాత్రం బాగాలేదని, శారీరక వ్యాయామం చేయాలనే మీ ఉద్దేశం చాలా గొప్పది అయితే, ముందస్తు అనుభవం లేకుండా ఈ వయసులో పుష్-అప్స్ చేయమని అకస్మాత్తుగా చెప్పడం సరికాదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది. 

ఇక మోడల్‌గా మిలింద్‌ సోమన్‌ సంచలనాలు సృష్టించారు. న్యూడ్‌గా పాముతో సెల్ఫీ దిగి అప్పట్లో పెద్ద దుమారం రేపారు. ఆమె మ్యాగజీన్ల కోసం ఇచ్చే ఫోటో షూట్‌లు చాలా సార్లు వివాదంగా, చర్చనీయాంశంగా మారుతుంటాయి. 80, 90 దశకాల్లో టాప్ మోడల్ గా రాణించిన ఆయన మధు సప్రేతో కలిసి ఎన్నో యాడ్స్‌లో నటించారు. ప్రముఖ గాయని అలీషా చినాయ్ రూపొందించిన `మేడ్ ఇన్ ఇండియా మ్యూజిక్‌`తో పాపులర్‌ అయ్యారు. 53 ఏళ్ల మిలింద్  మూడేళ్ల క్రితం తనకంటే వయసులో 26 ఏళ్లు చిన్నదైన అంకితా కోన్వార్‌ను వివాహం చేసుకుని మరోసారి వార్తల్లో నిలిచారు. 

click me!