మరో రికార్డు కొట్టిన ఎన్టీఆర్!

By team teluguFirst Published May 29, 2021, 8:10 PM IST
Highlights

 తాత ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఆయనను స్మరించుకుంటూ ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేశారు. నిన్న ఒక్క రోజే ఎన్టీఆర్ ఫాలోయర్స్ సంఖ్య రెండు వేలు పెరిగింది. 

టాలీవుడ్ టాప్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కరోనా నుండి కోలుకున్నారు. ఇటీవల ఆయన సోషల్ మీడియా వేదికగా తనకు కరోనా నెగిటివ్ గా రిజల్ట్ వచ్చినట్లు తెలియజేశాడు. ఈ న్యూస్ ఆయన అభిమానులను ఆనందంలో ముంచి వేసింది.కాగా ఎన్టీఆర్ ట్విట్టర్ ఫాలోవర్స్ సంఖ్య 5మిలియన్స్ కి చేరుకుంది. ఇది కూడా ఓ రికార్డు అని చెప్పాలి. ఎన్టీఆర్ సోషల్ మీడియాలో అంత యాక్టీవ్ గా ఉండరు. అరుదుగా ట్విట్టర్ పోస్ట్స్ చేస్తూ ఉంటారు. అతి తక్కువ పోస్ట్స్ తో ఎన్టీఆర్ 5 మిలియన్స్ కి చేరుకోవడం విశేషం. 


నిన్న తాత ఎన్టీఆర్ జయంతి నాడు ఎన్టీఆర్ ఆయనను స్మరించుకుంటూ ట్విట్టర్ లో సందేశం పోస్ట్ చేశారు. నిన్న ఒక్క రోజే ఎన్టీఆర్ ఫాలోయర్స్ సంఖ్య రెండు వేలు పెరిగింది. ఇక టాలీవుడ్ నుండి 11మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ తో మహేష్ బాబు అందరికంటే ముందు ఉన్నారు. 


కాగా ఎన్టీఆర్ ఈ మధ్య ప్రకటించిన ప్రాజెక్ట్స్ ఫ్యాన్స్ కి ఫుల్ కిక్ ఇచ్చాయి. తన 30వ చిత్రం దర్శకుడు కొరటాల శివతో ఆయన సెట్ చేశారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా జరిగిపోయింది. సాధారణ పరిస్థితులు ఏర్పడిన వెంటనే సెట్స్ పైకి వెళ్లే అవకాశం కలదు. 


ఇక ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ మూవీ ప్రకటించడం ఇండస్ట్రీని షేక్ చేసింది. ఈ భారీ కాంబినేషన్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుండో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ బర్త్ డే కానుకగా ప్రశాంత్ నీల్-ఎన్టీఆర్ మూవీ పై అధికారిక ప్రకటన వెలువడింది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 
 

click me!