ఎవరితో పోల్చినా నేను నిలబడగలను.. రీమేక్ మూవీ చేయడంపై చిరంజీవి పవర్ ఫుల్ కామెంట్స్

By team teluguFirst Published Oct 4, 2022, 3:36 PM IST
Highlights

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు. 

మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్ చిత్రం అక్టోబర్ 5న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతోంది. రిలీజ్ కి సర్వం సిద్ధం అయింది. ఆచార్య డిజాస్టర్ ఎఫెక్ట్ తో గాడ్ ఫాదర్ మూవీపై బిగినింగ్ లో బజ్ క్రియేట్ కాలేదు. కానీ ప్రమోషన్స్ జోరు పెరిగే కొద్దీ హైప్ మొదలయింది. మరికొన్ని గంటల్లో గాడ్ ఫాదర్ చిత్రం థియేటర్స్ లో సందడి చేయనుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోతోంది. 

తాజాగా జరిగిన గాడ్ ఫాదర్ మీడియా సమావేశంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గాడ్ ఫాదర్ చిత్రం రీమేక్ మూవీ. మలయాళంలో ఘన విజయం సాధించిన లూసిఫెర్ మూవీకి రీమేక్ గా గాడ్ ఫాదర్ చిత్రాన్ని తెరకెక్కించారు. తెలుగు సినిమా జాతీయ అంతర్జాతీయ స్తాయిలో ఖ్యాతి సొంతం చేసుకుంటోంది. అలాంటప్పుడు తెలుగు సబ్జెక్టుతోనే మూవీ చేయొచ్చు కదా.. రీమేక్ సినిమా ఎందుకు అని చిరంజీవిని ఓ మీడియా ప్రతినిధి ప్రశ్నించారు. 

దీనితో చిరు బదులిస్తూ.. రీమేక్ అనే అందుకు అంత తక్కువ భావన ఉంటుంది.. వాస్తవానికి రిమేక్ చేయడమే పెద్ద ఛాలెంజ్. వరిజినల్ స్థాయికి నిలబడగలమా లేదా అనే అనుమానం ఉంటుంది. మరొకరితో నన్ను పోల్చినా పర్వాలేదు.. నేను నిలబడగలను. నా హిస్టరీ చూసుకోండి. నేను చేసిన రీమేక్ చిత్రాలు నాకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి అని చిరంజీవి అన్నారు. 

గాడ్ ఫాదర్ చిత్రంలో చాలా మార్పులు చేసినట్లు దర్శకుడు మోహన్ రాజా కూడా కామెంట్స్ చేశారు. సెకండ్ హాఫ్ లో చాలా సన్నివేశాలు మార్చినట్లు పేర్కొన్నారు. లూసిఫెర్ తో ఈ చిత్రాన్ని పోల్చిన మా టీం కి భయం లేదని.. గాడ్ ఫాదర్ కొత్తగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ చిత్రంలో చాలా సర్ప్రైజ్ లు ఉండబోతున్నట్లు చిత్ర యూనిట్ లీకులు ఇస్తోంది. 

click me!