మలయాళంలో సంచలన విజయం సాధించిన `మంజుమేల్ బాయ్స్` మూవీ ఇప్పుడు తెలుగులో రాబోతుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ని ప్రకటించారు.
మలయాళంలో సంచలన విజయం సాధించింది `మంజుమేల్ బాయ్స్`. సస్పెన్స్ థ్రిల్లర్ గా అతి తక్కువ బడ్జెట్తో రూపొందిన ఈ మూవీ మలయాళ రికార్డులను బ్రేక్ చేసింది. సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. మాలీవుడ్లోనే హైయ్యెస్ట్ కలెక్షన్లు సాధించిన చిత్రంగా నిలిచింది. రెండు వందల కోట్లకి దగ్గరలో ఉంది.
ఇప్పుడు ఈ మూవీ తెలుగులోనూ రాబోతుంది. తెలుగులో డబ్ చేయబోతున్నారు. తాజాగా రిలీజ్ డేట్ని ప్రకటించారు. ఏప్రిల్ 6న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. `ఫ్యామిలీ స్టార్` రిలీజ్ అయిన నెక్ట్స్ డే ఈ మూవీ రాబోతుంది. తెలుగులో దీన్ని `మంజుమ్మల్ బాయ్స్`గా రిలీజ్ చేస్తుండటం విశేషం.
ఇటీవల మలయాళ మూవీ `ప్రేమలు` కూడా సంచలన విజయం సాధించింది. ఇది సుమారు 150కోట్ల వరకు వసూలు చేసింది. ఇంకా రన్ అవుతుంది. తెలుగులోనూ ఇది పదిహేను కోట్ల వరకువసూళు చేసింది. ఇప్పుడు మరో సంచలనం `మంజుమ్మల్ బాయ్స్` రాబోతుండటం విశేషం. ఇందులో అంతా కొత్తవారే నటించారు. చిదంబరం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కుర్రాళ్లు సౌబిన్ శహిర్, శ్రీనాథ్ భసి, బాలు వర్గేసే, గజపతి ఎస్ పోదువాల్, లాల్ జూ, దీపక్ పరంబోల్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.
`మంజుమ్మల్ బాయ్స్` యదార్థ సంఘటన ఆధారంగా రూపొందించారు. ఇందులో మంజు మేల్ బాయ్స్ అనేది కుర్రాళ్ల టీమ్.. వీరంతా కమల్ హాసన్ అభిమానులు. తమిళనాడులోని గుణ గుహలకి విహారయాత్రకి వెళ్తారు. కమల్ నటించిన `గుణ` సినిమా షూటింగ్ జరిగిన కేవ్స్ కి ఈ కుర్రాళ్లు వెళ్తారు. అక్కడ ఓ వ్యక్తి డెవిల్స్ కిచెన్లో పడిపోతారు. దీంతో మిగిలిన యువకులు తమ స్నేహితుడిని ఎలా కాపాడుకున్నారనేది కథ. ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్గా, సీట్ ఎడ్జ్ థ్రిల్లర్గా సాగుతుంది.
ఈ సినిమా మలయాళంలో పెద్ద హిట్ కావడంతోపాటు అంతా చర్చనీయాంశంగా మారింది. దీంతో అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. తెలుగు ఆడియెన్స్ లోనూ క్యూరియాసిటీ ఏర్పడింది. మరి ఇప్పుడు తెలుగులో రాబోతున్న ఈ మూవీ ఏ రేంజ్లో ఆదరణ పొందుతుందో చూడాలి. ఈ మూవీని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ కలిసి డబ్ చేస్తుండటం విశేషం.