ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది.
పాయిల్ రాజ్పుత్, అజయ్ భూపతి కాంబోలో వచ్చిన ‘మంగళవారం’ సినిమాకు మొదట మంచి టాక్ వచ్చింది. ప్రీమియర్ షో లనుంచే హిట్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులతో పాటు విమర్శకులు కూడా మంచి రివ్యూలు ఇవ్వటం కలిసి వచ్చిందని భావించారు. అయితే ఆదివారం ప్రపంచ కప్ మ్యాచ్ ఉండటంతో థియేటర్లకు జనం రాలేదు. మొదటి రెండు రోజులతో పోల్చుకుంటే భారీగానే వసూళ్లను కోల్పోయింది. దాంతో సినిమా టాక్ కు సమానంగా క్లిక్ అవ్వలేదు. భాక్సాఫీస్ వద్ద ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వలేదని సమాచారం.
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 11వ రోజున 29 లక్షల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోగా 12వ రోజున సినిమా 22 లక్షల రేంజ్ లో షేర్ ని ఇప్పుడు సొంతం చేసుకుంది. బాక్స్ ఆఫీస్ దగ్గర 12 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ని గమనిస్తే…
👉నైజాం : 3.93Cr
👉సీడెడ్ : 1.41Cr
👉ఉత్తరాంధ్ర: 1.11Cr
👉ఈస్ట్ గోదావరి: 67L
👉వెస్ట్ గోదావరి: 46L
👉గుంటూరు: 64L
👉కృష్ణా : 46L
👉నెల్లూరు: 30L
ఆంధ్రా -తెలంగాణా టోటల్:- 8.98CR(16.55Cr గ్రాస్ )
👉కర్ణాటక+రెస్టాఫ్ ఇండియా+ఓవర్ సీస్ : 1.36Cr
మొత్తం ప్రపంచ వ్యాప్తం కలెక్షన్స్ – 10.34CR(19.50CR గ్రాస్)
ఇక ఈ చిత్రం విడుదలకు ముందు భారీ అంచనాలు ఉన్నాయి. భారీ అంచనాల నేపథ్యంలో ప్రీ రిలీజ్ బిజినెస్ పెద్ద ఎత్తున జరిగింది. ట్రేడ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు నైజాంలో 3.20 కోట్ల రూపాయలు.. ఆంధ్రప్రదేశ్, సీడెడ్ ఏరియాల్లో 7 కోట్ల రూపాయలు.. దేశ వ్యాప్తంగా 2 కోట్లు.. ప్రపంచవ్యాప్తంగా 12.20 కోట్ల రూపాయల బిజినెస్ చేసింది. అలా బాక్స్ ఆఫీస్ దగ్గర 13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా సినిమా బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా 2.66 కోట్ల రేంజ్ లో షేర్ ని సొంతం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మంగళవారం ఓటీటీ రిలీజ్ విషయానికి వస్తే.. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవ్వనుంది. డిసెంబర్ రెండో వారంలో అంటే డిసెంబర్ 10 నుంచి ఈ చిత్రం స్ట్రీమింగ్ అయ్యేఅవకాశం ఉంది. అయితే అఫీషియల్ సమాచారం ఏమీ ఈ విషయమై లేదు. ఓటిటి డేట్ కలెక్షన్స్ చూసి మార్చే అవకాసం ఉందంటున్నారు.
అయితే ఫ్యామిలీలకు ఈ సినిమా కాస్తంత దూరంగానే ఉంటుంది. ముఖ్యంగా దీంట్లోని అక్రమ సంబంధాల వ్యవహారం.. కొన్ని ద్వంద్వార్థ సంభాషణలు.. హీరోయిన్ కు ఉన్న సమస్య వంటివి ఫ్యామిలీ ఆడియన్స్కు ఎబ్బెట్టుగా అనిపించొచ్చు. ఈ చిత్రంలో కనిపించే ఓ ప్రత్యేకత ఏంటంటే.. ఇంట్రవెల్ ముందు వరకు పాయిల్ కనిపించకున్నా.. అసలు కథ మొదలు కాకున్నా.. ఎక్కడా బోర్ కొట్టించకుండా కథను ముందుకు నడిపించారు దర్శకుడు అజయ్.