Maa Elections: పోస్టల్ బ్యాలెట్ ఫలితాల్లో మంచు విష్ణు ప్యానెల్ ముందంజ.. 50 చెల్లని ఓట్లు

By Siva KodatiFirst Published Oct 10, 2021, 6:11 PM IST
Highlights

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికల  (maa Elections) కౌంటింగ్ (counting)  జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ (postal ballot) ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. వీటిలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో వున్నట్లు అధికారులు తెలిపారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ‘‘మా’’ ఎన్నికల  (maa Elections) కౌంటింగ్ (counting)  జరుగుతోంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ (postal ballot) ఓట్లను ఎన్నికల అధికారులు లెక్కించారు. వీటిలో మంచు విష్ణు ప్యానెల్ ముందంజలో వున్నట్లు అధికారులు తెలిపారు. ముందుగా ఈసీ మెంబర్ల ఫలితాలు వెలువడనున్నాయి. మొత్తం ఆరు టేబుల్స్‌పై ఓట్లను లెక్కిస్తున్నారు. ఈసీ మెంబర్లలో 50 చెల్లని ఓట్లు వున్నాయని అధికారులు ప్రకటించారు. 

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికల పోలింగ్ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 665 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోస్టల్ బ్యాలెట్‌తో కలిపి వీటి సంఖ్య 700 దాటే అవకాశం వుందని సమాచారం. గతంలోనే ఎన్నడూ లేని విధంగా 83 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. 

ALso Read:MAA elections:మా చరిత్రలోనే ఎక్కువ పోలింగ్... విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్న మంచు విష్ణు

అంతకుముందు  ఊహించిన దాని కంటే ఎక్కువగా సభ్యులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోటెత్తడంతో ముందుగా ఇచ్చిన పోలింగ్ గడువు సరిపోదని మా ఎన్నికల అధికారులు నిర్థారించారు. దీంతో మా అధ్యక్ష అభ్యర్ధులు ప్రకాశ్ రాజ్ (prakash raj), మంచు విష్ణులతో (manchu vishnu) చర్చించిన ఎన్నికల అధికారులు పోలింగ్ సమయం మరో గంట పెంచాలని నిర్ణయించారు. దీంతో మా ఎన్నికల పోలింగ్ 3 గంటల వరకు జరిగింది. క్యూలైన్‌లో వున్నవారికి ఓటు వేసేందుకు అనుమతి ఇచ్చారు. పోటీలో నిలిచిన ఇరు ప్యానెల్స్ ప్రకాష్ రాజ్, మంచు విష్ణు విజయంపై విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా తమ ప్యానెల్ విజయం సాధిస్తుంది అంటూ.. ధీమాగా చెబుతున్నారు. ఇంత హోరాహోరీగా జరిగిన ఎన్నికలలో విజేత ఎవరనేది మరి కొన్ని గంటలలో తేలిపోనుంది. 
 

click me!